‘అగ్నిపథ్’ సైనిక నియామకాలను వ్యతిరేకిస్తూ.. యువత పెద్ద ఎత్తున సికింద్రాబాద్లో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైళ్లకు నిప్పు కూడా పెట్టింది. అయితే.. ఈ సందర్భంగా కొందరు యువకులు తగల బడుతున్న రైళ్లకు ఎదురుగా నిలబడి.. సెల్పీలు దిగడం.. తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఉద్దేశ పూర్వకంగానే రైళ్లను తగలబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముట్టడికి ఆందోళనకారులు ముందుగానే ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఏకంగా.. రెండు రోజుల ముందు నుంచి రైల్వే స్టేషన్ ముట్టడికి ప్రణాళికను సిద్ధం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆందోళనకారులు నిరసనకు దిగారని భావిస్తున్నారు. రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో వాట్సాప్ గ్రూప్ను ఆందోళనకారులు క్రియేట్ చేశారు. ఈనెల 15న మధ్యాహ్నం 1:50 గంటలకు గ్రూప్ క్రియేట్ అయ్యింది. అలాగే వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ పేరుతో మరో గ్రూప్తో పాటు, 15న ఉదయం 11:12 గంటలకు మరో గ్రూప్ను క్రియేట్ చేశారు. ఒక్క రోజులోనే గ్రూప్లో మొత్తం 1000 మంది జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 9:30 గంటల వరకు బస్సులు, టాక్సీలు, ప్రైవేట్ బండ్లు మాట్లాడుకుని మిగతా విద్యార్థులు హైదరాబాద్కు వచ్చారు. దాదాపు 500 మంది విద్యార్థులు 16 రాత్రి స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాలకు చేరుకున్నారు. రాత్రే స్టేషన్ లోపలకి 100 మంది విద్యార్థులు చేరుకున్నారు. ఎగ్జామ్ పెట్టాలని స్టేషన్ ముట్టడికి మొదట ప్లాన్ చేసినప్పటికీ… అగ్నిపథ్ స్కీం ప్రకటన తరువాత వాట్స్ అప్ గ్రూప్ క్రియేట్ అయ్యింది. ఫోన్స్, మెసేజ్ల ద్వారా యువకులు అప్డేట్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే రైళ్లు ఆపి నిరసన తెలపాలని ఆందోళనకారులు భావించారు. ఈ పరిస్థితికి పోలీసుల అత్యుత్సాహమే కారణమని ఆందోళనకారులు ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జ్తో నిరసనకారులు ఇంతటి విధ్వంసానికి దిగారని అంటున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై పోలీస్ విచారణ కొనసాగుతోంది. వాట్సప్ గ్రూప్లతో అందరం కలిశామని నిరసనకారులు తెలుపడటంతో… వాట్సప్ గ్రూప్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు .. కాలిపోతున్న రైళ్ల ముందు నిలబడి.. సెల్పీలు దిగడం.. మరింత వివాదానికి దారితీస్తోంది. మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…