సినిమాలు చూసి కన్నీళ్లు పెట్టుకునే వారు ఇప్పుడు చాలా చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే.. తమ జీవితాల్లోనూ సినిమాలను మించిన కష్టాలు వస్తున్నాయి. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరి కష్టాలు సినిమాలను తలపిస్తున్నాయి. దీంతో ఎంతో బాధాకరమైన సన్నివేశాలు.. సెంటిమెంటుతో కూడిన సన్నివేశాలు ఉంటే తప్ప.. పెద్దగా ఎవరికి కళ్లు చెమర్చడం లేదు. కానీ, కర్ణాటక సీఎం మాత్రం ఓ సినిమా చూసి భోరున కన్నీరు కార్చారు. ఇదేదో ఒక్క క్షణమో.. రెండు క్షణాలో కాదు.. సినిమా చూస్తున్నంత సేపు.. తర్వాత కూడా ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఘటన ఆసక్తిగా మారి వైరల్ అవుతోంది.
విషయం ఏంటంటే..
పెంపుడు జంతువులకు, మనుషులకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటారు కొందరు. వాటికి ఏమైనా జరిగితే తట్టుకోలేరు కూడా. కొన్నిసార్లయితే కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి ఘటనే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకు ఎదురైంది. ఇటీవల ఆయన 777 చార్లీ అనే సినిమా చూశారు. పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అయితే సినిమా చూసిన సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా చూస్తూ ఉన్నంత సేపు భావోద్వేగానికి గురయ్యారు. సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు, వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినిమా చూశాక సీఎం బొమ్మై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. “కుక్కల గురించి అనేక సినిమాలు వచ్చాయి. అయితే జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించా”రని చెప్పుకొచ్చారు. కుక్కలది షరతులు లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అని అన్నారు.
బొమ్మై వ్యక్తిగతంగా జంతు ప్రేమికులు. కుక్కలంటే ఆయనకు మహా ప్రేమ. గతేడాది ఆయన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజా సినిమా చూసినప్పుడు మళ్లీ తన కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతటి అధికార హోదాలో ఉన్నా సెంటిమెంటుకు పడిపోని వారు ఉండరని సీఎం నిరూపించారని అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on June 15, 2022 10:59 am
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…