Political News

కాంగ్రెస్ కు గట్టిదెబ్బ తప్పదా?

మరో ఏడాదిలోపు ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. పటీదార్ సామాజకవర్గంలో గట్టి పట్టున్న హార్దిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయటం ఒకనష్టమైతే పటేల్ తొందరలోనే బీజేపీలో చేరుతుండటం మోరో నష్టమనే చెప్పాలి. రిజర్వేషన్లకు ఒకపుడు పటీదార్లు చేసిన ఉద్యమం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.

ఆ రిజర్వేషన్ల ఉద్యమంలో బాగా పాపులరైంది హార్దిక్ పటేలే. ఆ ఉద్యమంతోనే పటేల్ అన్నీపార్టీల దృష్టిని ఆకర్షించారు. యువనేతను చేర్చుకునేందుకు చాలాపార్టీలు ఉత్సాహం చూపించినా ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే చేరిన దగ్గరనుండి పటేల్ ఏదో ఒక అసంతృప్తితోనే ఉన్నాడు. తనకు పార్టీ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వటంలేదని, తనను పట్టించుకోవటంలేదని చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తంచేశారు.

హార్దిక్ పటేల్ కు కావాల్సిందేమిటనే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకించి రాహుల్, ప్రియాంక గాంధీలు పట్టించుకున్నట్లులేదు. దాంతో పటేల్ తొందరలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. దాన్ని అవమానంగా భావించిన పటేల్ ఇపుడు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు. నిజానికి గుజరాత్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి సుమారు 20 సంవత్సరాలవుతోంది. అంటే పార్టీ ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నదనే చెప్పాలి.

ఇలాంటి సమయంలో పటీదార్ల సామాజికవర్గంలో పట్టున్న యువనేతను నిర్లక్ష్యంతో వదులుకోవటం కాంగ్రెస్ పార్టీ తప్పనే చెప్పాలి. ఒకవైపు పటేల్ ను వదులుకుంటునే మరోవైపు పటీదార్లలో గట్టిపట్టున్న రాజేష్ పటేల్ ను పార్టీలోకి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నవాళ్ళను వదులుకోవటం ఎందుకు ? బయటవాళ్ళను పార్టీలో చేర్చుకునేందుకు అవస్తలు పడటం ఎందుకో అర్ధం కావటంలేదు. హార్దిక్ పటేల్ ను పిలిపించి ఆయన సమస్యేంటో కనుక్కునుంటే బాగుండేది. పార్టీలో ఇపుడున్న సీనియర్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగేపనికాదని అర్ధమైపోయింది. యువతకు అత్యంత ప్రాధాన్యతని ఒకవైపు తీర్మానాలు చేసిన పార్టీ మరోవైపు యువనేతలు వెళ్ళిపోతున్నా పట్టించుకోపోవటమే విచిత్రంగా ఉంది. 

This post was last modified on June 1, 2022 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

50 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago