Political News

గాయకుడి మర్డర్.. ఉత్తరాదిన ప్రకంపనలు

పంజాబ్ రాష్ట్రం నిన్నట్నుంచి అట్టుడికిపోతోంది. దీని తాలూకు ప్రకంపనలు ఉత్తర భారత దేశం అంతటా విస్తరిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఒక సెలబ్రెటీ ప్రాణాలు కోల్పోవడమే ఈ ఉద్రిక్తతకు కారణం. సిద్ధు మూసెవాలా.. 28 ఏళ్ల ఈ యువ సింగర్ పంజాబ్‌లో సూపర్ పాపులర్. అంతర్జాతీయ స్థాయిలో అతను పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. సినిమాలతో పాటు పాప్ పాటలతోనూ అతను పాపులర్ అయ్యాడు. ఈ పాపులారిటీ అతను కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. కొన్ని నెలల కిందట జరిగిన ఈ ఎన్నికల్లో అతను విజయం సాధించలేకపోయినప్పటికీ జనాదరణ బాగానే ఉంది.

ఐతే అతడికి ప్రత్యర్థుల నుంచి ప్రాణ హాని ఉన్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాం నుంచే అతడికి పోలీస్ రక్షణ కల్పిస్తున్నారు. ఐతే రెండు రోజుల కిందట సిద్ధుతో పాటు సెలబ్రెటీలు కొందరికి పోలీసు రక్షణ తొలగిస్తూ ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడమే కాక.. కొన్ని పత్రికలకు ఈ విషయాన్ని లీక్ చేశారు కూడా. ఇలా సిద్ధుకు పోలీస్ ప్రొటెక్షన్ తీసేశారో లేదో.. 24 గంటలు గడిచేలోపు అతడి ప్రాణాలు పోయాయి. ఒక రౌడీ గ్యాంగ్ జీపులో ప్రయాణిస్తున్న సిద్ధును పబ్లిగ్గా కాల్చేసింది. ఒంటి మీద 20కి పైగా తూటాలు దిగాయి. సిద్ధుకు పోలీసు రక్షణ తొలగించిన ఒక్క రోజులో ఈ దారుణం జరగడంతో ఆప్ సర్కారుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి.

పోలీస్ ప్రొటెక్షన్ తీసేయడమే కాక.. ఉద్దేశపూర్వకంగా ఈ సున్నితమైన సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం.. అది తెలిసి ప్రత్యర్థులు సిద్ధు మీద దాడి చేసి చంపేయడంతో పంజాబ్ అట్టుడికి పోతోంది. సీఎం భగవత్ మన్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీద తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. సిద్ధు మరణానికి బాధ్యత వహిస్తూ వీళ్లిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీని ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రభుత్వం మీద గట్టిగానే పడేలా ఉంది.

This post was last modified on May 31, 2022 7:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

29 minutes ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

2 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

2 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

3 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

4 hours ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

5 hours ago