ఏపీలో కొత్తగా వచ్చిన జగన్ 2.0 కేబినెట్లో మళ్లీ అవకాశం దక్కించుకోవడాన్ని మంత్రులు అదృష్టంగా భావిస్తున్నారు. ఇక, తమకు అవకాశం దక్కలేదని ఇప్పటికీ బాధపడుతున్న వారు కూడా కనిపిస్తున్నారు. అయితే.. రెండోసారి కూడా అవకాశం దక్కించుకున్నవారు.. తమ పనితీరును చూసి.. జగన్ అవకాశం ఇచ్చారని.. భావిస్తున్నారా? లేక.. కేవలం దేవుడిని నమ్ముకుంటే.. అవకాశం దక్కిందని అనుకుంటున్నారా? నిజానికి దైవబలం అందరికీ అవసరమే. అయితే.. కష్టాన్ని కూడానమ్ముకోవాలికదా!
ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి మరోసారి అవకాశం దక్కించుకున్న చెల్లుబోయిన వేణు కు సంబంధించి తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. ఆయనకు మరోసారి జగన్ అవకాశం ఇచ్చారు. శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా మరోసారి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన ఎలా పనిచేయాలి? ఏవిధంగా తన శాఖను అభివృద్ధి చేయాలి? అనేది చర్చకు వస్తోంది. కానీ, ఈ విషయాన్ని.. చెల్లుబోయిన పక్కన పెట్టారు.
ప్రస్తుతం సమాచార, ప్రసారశాఖలతోపాటు.. బీసీ సంక్షేమ శాఖను కూడా ఆయనకే జగన్ అప్పగించారు. సరే.. సమాచార శాఖలో అంటే.. పని ఏముంటుంది? అని సరిపెట్టుకుందాం. కానీ, బీసీ సంక్షేమం అంటే.. నాలుగు చేతులతో చేసినా.. వచ్చే రెండేళ్లపాటు ఇంకా మిగిలిపోయేంత పని ఉంది. ముఖ్యంగా బీసీలను పార్టీకి చేరువ చేయడం.. బీసీ హాస్టళ్ల పనితీరు.. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు.. బీసీలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు వారికి చేరువ చేయడం.. ఇలా అనేకం ఉన్నాయి.
అయితే.. వీటిని ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు. మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి.. ఈ నెల 28(గురువారం) నాటికి 16 రోజులు అయింది. ఈ 16 రోజుల్లో ఆయన ఏం చేశారంటే.. 7 రోజుల పాటు.. తిరుమల శ్రీవారికి మొక్కడానికే సరిపెట్టారు. మంత్రికాగానే వెళ్లిపోయారు. మూడు రోజులు అక్కడే తిష్టవేసి.. ఉదయం సాయంత్రం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా.. తూర్పులోని.. మరో ఇద్దరు కీలక నాయకులను వెంటేసుకుని.. నాలుగు రోజుల ట్రిప్ కోసం. తిరుమల వెళ్లిపోయారు. మరి ఇది ఎంత వరకు సమంజసం? అనేది కీలక ప్రశ్న. భక్తి ఉండొచ్చు. కానీ, బాధ్యతలు అంతకన్నా ముఖ్యం కదా మంత్రి వర్యా!! అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on April 28, 2022 11:50 pm
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…
నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్…
సక్సెస్ పరంగా అటు బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఇటు టాలీవుడ్ లో శ్రీలీల ఇంచుమించు ఒకే ఫేజ్ లో ఉన్నారు.…
కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా, గత వారం రిలీజైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జోరు బాగా…
అసలు ప్రమోషన్లు లేకుండా ఏదైనా సినిమాకు బజ్ లేదా ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం.…
సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ…