ఏపీలో కొత్తగా వచ్చిన జగన్ 2.0 కేబినెట్లో మళ్లీ అవకాశం దక్కించుకోవడాన్ని మంత్రులు అదృష్టంగా భావిస్తున్నారు. ఇక, తమకు అవకాశం దక్కలేదని ఇప్పటికీ బాధపడుతున్న వారు కూడా కనిపిస్తున్నారు. అయితే.. రెండోసారి కూడా అవకాశం దక్కించుకున్నవారు.. తమ పనితీరును చూసి.. జగన్ అవకాశం ఇచ్చారని.. భావిస్తున్నారా? లేక.. కేవలం దేవుడిని నమ్ముకుంటే.. అవకాశం దక్కిందని అనుకుంటున్నారా? నిజానికి దైవబలం అందరికీ అవసరమే. అయితే.. కష్టాన్ని కూడానమ్ముకోవాలికదా!
ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి మరోసారి అవకాశం దక్కించుకున్న చెల్లుబోయిన వేణు కు సంబంధించి తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. ఆయనకు మరోసారి జగన్ అవకాశం ఇచ్చారు. శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా మరోసారి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన ఎలా పనిచేయాలి? ఏవిధంగా తన శాఖను అభివృద్ధి చేయాలి? అనేది చర్చకు వస్తోంది. కానీ, ఈ విషయాన్ని.. చెల్లుబోయిన పక్కన పెట్టారు.
ప్రస్తుతం సమాచార, ప్రసారశాఖలతోపాటు.. బీసీ సంక్షేమ శాఖను కూడా ఆయనకే జగన్ అప్పగించారు. సరే.. సమాచార శాఖలో అంటే.. పని ఏముంటుంది? అని సరిపెట్టుకుందాం. కానీ, బీసీ సంక్షేమం అంటే.. నాలుగు చేతులతో చేసినా.. వచ్చే రెండేళ్లపాటు ఇంకా మిగిలిపోయేంత పని ఉంది. ముఖ్యంగా బీసీలను పార్టీకి చేరువ చేయడం.. బీసీ హాస్టళ్ల పనితీరు.. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు.. బీసీలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు వారికి చేరువ చేయడం.. ఇలా అనేకం ఉన్నాయి.
అయితే.. వీటిని ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు. మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి.. ఈ నెల 28(గురువారం) నాటికి 16 రోజులు అయింది. ఈ 16 రోజుల్లో ఆయన ఏం చేశారంటే.. 7 రోజుల పాటు.. తిరుమల శ్రీవారికి మొక్కడానికే సరిపెట్టారు. మంత్రికాగానే వెళ్లిపోయారు. మూడు రోజులు అక్కడే తిష్టవేసి.. ఉదయం సాయంత్రం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా.. తూర్పులోని.. మరో ఇద్దరు కీలక నాయకులను వెంటేసుకుని.. నాలుగు రోజుల ట్రిప్ కోసం. తిరుమల వెళ్లిపోయారు. మరి ఇది ఎంత వరకు సమంజసం? అనేది కీలక ప్రశ్న. భక్తి ఉండొచ్చు. కానీ, బాధ్యతలు అంతకన్నా ముఖ్యం కదా మంత్రి వర్యా!! అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on April 28, 2022 11:50 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…