Political News

జ‌గ‌న్ రెడ్డీ..  వ‌డ్డీ వ్యాపారం చేస్తున్నావా?: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. రైతుల నుంచి నీటి తీరువా వసూలును పవన్‌ కళ్యాణ్ ఖండించారు. నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వానిది అప్రజాస్వామిక విధాన‌మ‌ని తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా టార్గెట్‌ పెట్టి మరీ నీటి పన్నులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చిన్నసముద్రం అనే చిన్నగ్రామానికి రూ.29 లక్షలు టార్గెట్‌ పెట్టారని విమర్శించారు. 2018 నుంచి లెక్కగట్టి 6 శాతం వడ్డీతో వసూలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి పాలన చేస్తున్నారా?, వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఆస్తిపన్ను చెల్లించలేదని గతనెలలో ఇళ్లకు తాళాలు వేశారని…నెలలు గడిచినా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని దుయ్య బట్టారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. రైతులు వ్య‌వ‌సాయం చేయ‌డం క‌న్నా.. ఆత్మ‌హ‌త్య‌లే మేల‌ని భావిస్తార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా.. సీఎం జ‌గ‌న్ త‌న తీరును మార్చుకుని.. ప్ర‌జ‌ల‌పై భారాలు మోపే విధానానికి స్వ‌స్థి ప‌ల‌కాల‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇక‌, తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్ ఘటనపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూయా ఆస్పత్రి ప్రభుత్వానిదా? వైసీపీదా? అని ప్రశ్నించారు. రూయా ఆస్పత్రిలో సైకిల్ పార్కింగ్ నుండి ప్రతి టెండర్ వైసీపీ నాయకులదే అని అన్నారు.

అంబులెన్స్ ఘటన సమయంలో ప్రభుత్వ అంబులెన్స్‌లు ఏమయ్యాయో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్ మాఫియాలో వైసీపీ కార్పొరేటర్లకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. తిరుపతి నగరంలో వైసీపీ కార్పొరేటర్లు రూ.50ను కూడా వదలడం లేదని అన్నారు. అంబులెన్స్ ఘటనలో బాధ్యులను చేసి ఆర్ఎంఓ సరస్వతి దళితురాలు కాబట్టి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. రూయా ఆర్ఎంఓ అగ్రవర్ణాలకు చెందిన ఆమె కాదు.. కాబట్టే సస్పెండ్ చేశారని విమర్శించారు.

రూయా ఆస్పత్రికి ఆధార్ కార్డుతో వెళితే.. డెత్ సర్టిఫికేట్ ఇచ్చి పంపే పరిస్థితి ఏర్పడిందన్నారు. రూయా ఆస్పత్రికి ఎవరైనా చికిత్స కోసం వస్తే కొందరు సిబ్బంది రోగులను బయట ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని తెలిపారు. రిఫర్ చేసిన ఆస్పత్రుల నుండి కమీషన్ గుంజుతున్నారన్నారు. రూయా ఆస్పత్రిని వైసీపీ ఆస్పత్రిగా మార్చవద్దని  కోరారు. 

Satya

Recent Posts

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…

24 minutes ago

తెలుగోళ్లు గిచ్చితే కానీ… తమిళ సినిమా మారలేదు

ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…

1 hour ago

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

3 hours ago

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

6 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

7 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

8 hours ago