జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల నుంచి నీటి తీరువా వసూలును పవన్ కళ్యాణ్ ఖండించారు. నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వానిది అప్రజాస్వామిక విధానమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా టార్గెట్ పెట్టి మరీ నీటి పన్నులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చిన్నసముద్రం అనే చిన్నగ్రామానికి రూ.29 లక్షలు టార్గెట్ పెట్టారని విమర్శించారు. 2018 నుంచి లెక్కగట్టి 6 శాతం వడ్డీతో వసూలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్రెడ్డి పాలన చేస్తున్నారా?, వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఆస్తిపన్ను చెల్లించలేదని గతనెలలో ఇళ్లకు తాళాలు వేశారని…నెలలు గడిచినా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని దుయ్య బట్టారు. ఇలా చేయడం వల్ల.. రైతులు వ్యవసాయం చేయడం కన్నా.. ఆత్మహత్యలే మేలని భావిస్తారని అన్నారు. ఇప్పటికైనా.. సీఎం జగన్ తన తీరును మార్చుకుని.. ప్రజలపై భారాలు మోపే విధానానికి స్వస్థి పలకాలని పవన్ వ్యాఖ్యానించారు. ఇక, తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్ ఘటనపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూయా ఆస్పత్రి ప్రభుత్వానిదా? వైసీపీదా? అని ప్రశ్నించారు. రూయా ఆస్పత్రిలో సైకిల్ పార్కింగ్ నుండి ప్రతి టెండర్ వైసీపీ నాయకులదే అని అన్నారు.
అంబులెన్స్ ఘటన సమయంలో ప్రభుత్వ అంబులెన్స్లు ఏమయ్యాయో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్ మాఫియాలో వైసీపీ కార్పొరేటర్లకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. తిరుపతి నగరంలో వైసీపీ కార్పొరేటర్లు రూ.50ను కూడా వదలడం లేదని అన్నారు. అంబులెన్స్ ఘటనలో బాధ్యులను చేసి ఆర్ఎంఓ సరస్వతి దళితురాలు కాబట్టి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. రూయా ఆర్ఎంఓ అగ్రవర్ణాలకు చెందిన ఆమె కాదు.. కాబట్టే సస్పెండ్ చేశారని విమర్శించారు.
రూయా ఆస్పత్రికి ఆధార్ కార్డుతో వెళితే.. డెత్ సర్టిఫికేట్ ఇచ్చి పంపే పరిస్థితి ఏర్పడిందన్నారు. రూయా ఆస్పత్రికి ఎవరైనా చికిత్స కోసం వస్తే కొందరు సిబ్బంది రోగులను బయట ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని తెలిపారు. రిఫర్ చేసిన ఆస్పత్రుల నుండి కమీషన్ గుంజుతున్నారన్నారు. రూయా ఆస్పత్రిని వైసీపీ ఆస్పత్రిగా మార్చవద్దని కోరారు.
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…