Political News

జ‌గ‌న్ రెడ్డీ..  వ‌డ్డీ వ్యాపారం చేస్తున్నావా?: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. రైతుల నుంచి నీటి తీరువా వసూలును పవన్‌ కళ్యాణ్ ఖండించారు. నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వానిది అప్రజాస్వామిక విధాన‌మ‌ని తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా టార్గెట్‌ పెట్టి మరీ నీటి పన్నులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చిన్నసముద్రం అనే చిన్నగ్రామానికి రూ.29 లక్షలు టార్గెట్‌ పెట్టారని విమర్శించారు. 2018 నుంచి లెక్కగట్టి 6 శాతం వడ్డీతో వసూలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి పాలన చేస్తున్నారా?, వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఆస్తిపన్ను చెల్లించలేదని గతనెలలో ఇళ్లకు తాళాలు వేశారని…నెలలు గడిచినా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని దుయ్య బట్టారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. రైతులు వ్య‌వ‌సాయం చేయ‌డం క‌న్నా.. ఆత్మ‌హ‌త్య‌లే మేల‌ని భావిస్తార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా.. సీఎం జ‌గ‌న్ త‌న తీరును మార్చుకుని.. ప్ర‌జ‌ల‌పై భారాలు మోపే విధానానికి స్వ‌స్థి ప‌ల‌కాల‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇక‌, తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్ ఘటనపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూయా ఆస్పత్రి ప్రభుత్వానిదా? వైసీపీదా? అని ప్రశ్నించారు. రూయా ఆస్పత్రిలో సైకిల్ పార్కింగ్ నుండి ప్రతి టెండర్ వైసీపీ నాయకులదే అని అన్నారు.

అంబులెన్స్ ఘటన సమయంలో ప్రభుత్వ అంబులెన్స్‌లు ఏమయ్యాయో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్ మాఫియాలో వైసీపీ కార్పొరేటర్లకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. తిరుపతి నగరంలో వైసీపీ కార్పొరేటర్లు రూ.50ను కూడా వదలడం లేదని అన్నారు. అంబులెన్స్ ఘటనలో బాధ్యులను చేసి ఆర్ఎంఓ సరస్వతి దళితురాలు కాబట్టి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. రూయా ఆర్ఎంఓ అగ్రవర్ణాలకు చెందిన ఆమె కాదు.. కాబట్టే సస్పెండ్ చేశారని విమర్శించారు.

రూయా ఆస్పత్రికి ఆధార్ కార్డుతో వెళితే.. డెత్ సర్టిఫికేట్ ఇచ్చి పంపే పరిస్థితి ఏర్పడిందన్నారు. రూయా ఆస్పత్రికి ఎవరైనా చికిత్స కోసం వస్తే కొందరు సిబ్బంది రోగులను బయట ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని తెలిపారు. రిఫర్ చేసిన ఆస్పత్రుల నుండి కమీషన్ గుంజుతున్నారన్నారు. రూయా ఆస్పత్రిని వైసీపీ ఆస్పత్రిగా మార్చవద్దని  కోరారు. 

This post was last modified on April 28, 2022 7:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

19 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago