వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. పపార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా వీరు గట్టివాయిస్ వినిపించారు. మీడియా ముందు.. తీవ్ర వ్యాఖ్యలు చేసి.. నిరంతరం ట్రోల్ అయ్యారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్.. సహా.. జనసేనపై విరుచుకుపడేవారు. ఇలాంటి వారిలో ఒకరిద్దరు మరింత పేరు తెచ్చుకున్నారు. వీరిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నగరి ఎమ్మెల్యే రోజా కీలక పాత్రలో కనిపించేవారు.
ఆమె నోరు విప్పితే సంచలన కామెంట్లు అలవోకగా వచ్చేవి. సవాళ్లకు, ప్రతిసవాళ్లకు కూడా ఆమె కీలకంగా మారేవారు. దీంతో రోజా రేంజ్ ఓ రేంజ్లో సాగింది. ఇక, తనకు ఇబ్బంది వచ్చినా. ఆమె అదే రేంజ్లో రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయాలపైనా.. ఆమె.. సంచలన వ్యాఖ్యలు చేసేశారు. అయితే.. ఇప్పుడు రోజాకు జగన్ ప్రమోషన్ ఇచ్చారు. తన కేబినెట్ 2.0లోకి రోజాను తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశారంటే… మరింతగా ప్రోత్సహించేందుకేనని అంటున్నారు.
అయితే.. దీనికి భిన్నంగా రోజా .. ఇప్పుడు ఎక్కడా మీడియా ముందుకు రావడం లేదు. మంత్రివర్గంలో చోటు ఇచ్చి.. ఇప్పటికి 15 రోజులు అయింది. ఇన్నిరోజుల్లో ఎక్కడా ఆమె.. మీడియా ముందుకు రావడం కానీ, గతంలో మాదిరిగా.. ప్రతిపక్షాలపై విరుచుకుపడడం కానీ.. కనిపించడం లేదు. ఈ పదిహేను రోజుల్లో రాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి.. ఒంగోలులో ఓ కుటుంబం వెళ్తున్న కారును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకోవడం అయితే.. రెండోది విజయవాడలో ఓ యువతిపై అత్యాచారం ఘటన.
ఈ రెండు విషయాలపైనా.. ప్రతిపక్షం టీడీపీ నిప్పులు చెరిగింది. జగన్ అసమర్థపాలకుడంటూ.. కామెంట్లు చేసింది. అంతేకాదు.. ఆయన తక్షణం పదవికి రాజీనామా చేయాలని కూడా వ్యాఖ్యానించింది. నిజానికి వైసీపీని, జగన్ను ఏమైనా అంటే.. అస్సలు ఊరుకోని.. రోజా.. ఇప్పుడు ఎక్కడా కనిపించలేదు. పోనీ నామమాత్రంగా కూడా స్పందించలేదు. దీంతో మంత్రి అయ్యాక ఆమె మారిపోయారబ్బా! అనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. పరిస్థితి వేరు.. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు! అని తనను తాను ఆమె మార్చుకున్నారేమో.. అనే గుసగుస వినిపిస్తోంది.
This post was last modified on April 25, 2022 11:01 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…