Political News

జైల్లో షటిల్‌ ఆడుకున్న వాళ్లా.. నాకు నీతులు చెప్పేది: జ‌న‌సేనాని ఫైర్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. చంచ‌ల్‌గూడ జైల్లో ష‌టిల్ ఆడుకున్న‌వాళ్లా.. నాకు నీతులు చెప్పేది! అంటూ.. మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ఏలూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. తాజాగా నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. ఏపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాల దీన స్థితిపై  కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టాన‌న్నారు.  

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఆర్థిక సాయం అదించిన‌ట్టు తెలిపారు.. వైసీపీ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని ఆయ‌న‌ హెచ్చరించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు కనిపించడం లేదన్నారు. తనను దత్తపుత్రుడని ఇంకోసారి అంటే.. సీబీఐ దత్తపుత్రుడు అని తానూ అనాల్సి వస్తుందని మ‌రోసారి హెచ్చ‌రించారు. చంచల్‌గూడ జైల్లో షటిల్‌ ఆడుకున్న వాళ్లా..తనకు నీతులు చెప్పేది అని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు.

కాగా, దీనికి ముందు  జిల్లాకు వచ్చిన ప‌వ‌న్‌కు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. గజమాలతో ఘన స్వాగతం పలికారు.  పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని.. పవన్‌ పరామర్శించారు. మృతుని భార్యకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ నేపథ్యం వివరాలను అడిగి తెలుసుకుని.. తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, చింతలపూడి మండలంలో ఆత్మహత్య చేసుకున్న పదకొండు రైతు కుటుంబాలను.. పవన్ పరామర్శించారు.

అంతకుముందు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు.. భారీగా అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు. గజమాలతో అధినేతకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో దుగ్గిరాల వద్ద పవన్ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న బైక్‌ను.. కారు ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. లింగపాలెం వద్ద పవన్ ప్రయాణిస్తున్న కారుకు పంక్చర్‌ అయ్యింది. పంక్చర్‌ వేసేవరకు.. పవన్ కల్యాణ్ ఆక్కడే ఉండి పర్యటన కొనసాగించారు. ఇదిలావుంటే, గ‌తంలోనూ ప‌వ‌న్ అనంత‌పురంలో కౌలు రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది పాటు.. ప‌వ‌న్ ఇదే యాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో రూ.5 కోట్ల వ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు ఆయ‌న ఆర్థిక సాయం చేయ‌నున్నారు.

This post was last modified on April 24, 2022 9:35 am

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

11 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

28 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

1 hour ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

2 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

3 hours ago