Political News

పవన్ యాత్రకు చిక్కులు.. ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తున్న ‘జేసీబీ’

జాతీయ.. అంతర్జాతీయంగా ‘జేసీబీ’ యంత్రం కారణంగా సాగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమార్కులు.. నేరస్తులు.. ఆందోళనతో ఆరాచకాన్ని క్రియేట్ చేసే వారి ఇళ్లను జేసీబీలతో ధ్వంసం చేయటం.. యూపీలో సక్సెస్ ఫార్ములాగా మారిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ అలాంటి విధానాలకు తెర తీస్తున్నారు. దీంతో.. జేసీబీలతో ఆరాచక పాలన సాగిస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జేసీబీలను వినియోగిస్తున్న వైనాన్ని చూసిన ఏపీ అధికారులు.. తమ మెదళ్లకు పని పెట్టినట్లుగా కనిపిస్తోంది.

సంఘ విద్రోక శక్తులకు భరతం పట్టేందుకు జేసీబీలు వాడే తీరును మరికాస్త డెవలప్ చేసి.. రాజకీయ ప్రతీకారాలకు వినియోగించేలా ఎత్తులు వేస్తున్న వైనం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త అలజడిగా మారుతోంది. ఏపీ అధికార పక్షమైన వైసీపీకి.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి పట్టని కౌలు రౌతుల ఆత్మహత్యల అంశాన్ని టేకప్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గడిచిన కొద్ది రోజులుగా ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతులకు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న 41 కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందించేందుకు పవన్ కల్యాణ్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి వారి సమస్యల్ని తెలుసుకొని.. పరిష్కారం కోసం పోరాడేందుకు వీలుగా సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ రైతు భరోసా యాత్రకు ఆటంకం కలిగించేందుకు వీలుగా కొన్నిచోట్ల రోడ్లను జేసీబీలతో తవ్వేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పవన్ పర్యటన వేళ ఇలాంటి చికాకులు ఎదురయ్యేలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

విపక్షంలో ఉన్న వేళ జగన్ చేసిన పాదయాత్ర సమయంలోనూ నాటి అధికారపక్షం ఇదే తీరుతో వ్యవహరించి ఉంటే.. ఆయన అసలు పాదయాత్రను చేసే వారేనా? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన జేసీబీలు ఏపీ అధికారుల పుణ్యమా అని ఇక్కడా రాజకీయ అలజడికి తెర తీస్తున్నారని చెప్పాలి. జేసీబీలు.. ఏపీ రాజకీయాల్ని ఏ రీతిలో మారుస్తాయో చూడాల్సిందే.

This post was last modified on April 23, 2022 3:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

48 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago