Political News

సీనియర్లకు కీలక పదవులు

కొందరు మంత్రులు, మరికొందరు మాజీలు, ఇంకొందరు సీనియర్ నేతలకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవులు అప్పగించబోతున్నారు. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసులరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్ళను జిల్లాల కన్వీనర్లుగా నియమింబోతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికీ రెండేసి జిల్లాలను అప్పగించబోతున్నారట. వీళ్ళు తమకు కేటాయించిన జిల్లాల్లోని నేతల మధ్య సమన్వయం చేసుకోవాలి.

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న కారణంగా ప్రభుత్వ వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది. అందుకనే తాను ప్రత్యక్షంగా పార్టీ వ్యవహారాలను చూసుకోలేరు కాబట్టి తన తరపున సీనియర్లు, బాగా నమ్మకమైన వారికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారు. కొన్ని జిల్లాల్లో నేతల మధ్య విభేదాలున్నాయి. అలాగే మంత్రి-ఎంఎల్ఏల మధ్య కూడా తేడాలున్నాయి. అలాంటి వాటిపై ఈ కన్వీనర్లు ముందుగా దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాల్సుంటుంది.

అలాగే జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయటంలో కూడా వీరి పాత్ర కీలకంగా మారబోతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది. ముఖ్యంగా టీడీపీ గెలిచిన 23 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయటం, రేపటి ఎన్నికల్లో పోటీ చేసేంత స్ధాయిలోని నేతలను గుర్తించటం కన్వీనర్ల బాధ్యత. పనిలోపనిగా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న విభాగాలను బలోపేతం చేయటం కూడా కీలకమే. ఇందులో భాగంగా ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్చార్జి బాధ్యతలనుండి జగన్ తప్పించారు. విజయసాయికి అనుబంధ సంఘాలను బలోపేతం చేసే బాధ్యతిచ్చారు.

అందుకనే ఈ ఎంపి ముందుగా సోషల్ మీడియా, పార్టీలోని నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియా, పార్టీలోని నిరుద్యోగులకు సుమారు  8 వేల మందికి ఉద్యోగాలు వచ్చినట్లు విజయసాయి ప్రకటించారు. ఇలాంటి జాబ్ మేళాలు మరో రెండింటిని నిర్వహిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా పార్టీని గ్రాస్ రూట్ లో బలోపేతం చేయటమే. కొందరేమో నేతల మధ్య విభేదాలను పరిష్కరించే పనిలో ఉంటే మరికొందరు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారన్నమాట. రెండోసారి గెలుపుకు తీసుకుంటున్న చర్యలన్నీ చివరకు ఏమవుతాయో చూడాల్సిందే.

This post was last modified on April 19, 2022 11:05 am

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

1 hour ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

1 hour ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago