Political News

వచ్చే ఎన్నికల్లో.. పవన్ పోటీ అక్కడి నుంచే!

జ‌న‌సేన పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు గ‌డిచిపోయాయి. ఇటీవ‌ల పార్టీ తొమ్మిదో వార్షికోత్స‌వ ఆవిర్భావ స‌భ జ‌రిగింది. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటి చేసిన జ‌న‌సేన‌కు ఆశించిన ఫ‌లితాలు ద‌క్క‌లేదు. ఈ మ‌ధ్య కాలంలో రాజ‌కీయంగా కాస్త ఎదిగిన పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాల దిశ‌గా న‌డిపించేందుకు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధ‌మ‌వుతున్నారు.

2024 ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిన ఆయ‌న పొత్తుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం సొంత ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టే పార్టీల‌తో క‌లిసి ప‌ని చేస్తామ‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు త‌న పొలిటిక‌ల్ కెరీర్‌పైనా ఆయ‌న దృష్టి సారించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక స్థానంలోనే పోటీ చేయాల‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది.

ఆ ఓట‌ముల‌తో..
గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ రెండు చోట్లా ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఈ సారి ఆ త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. పొత్తుల విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే ఆయ‌న ఈ సారి ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందుకు తూర్పు గోదావ‌రి జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌వ‌న్ ఎంచుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కాపు సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉన్నా తూర్పు గోదావరిలో ఓ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోట చేస్తే గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ని టాక్‌. మ‌రోవైపు ఇక్క‌డ జ‌న‌సేన క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉంది. అందుకే కాకినాడ రూర‌ల్ లేదా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌దాని నుంచి పోటీ చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

సుర‌క్షిత‌మ‌ని భావించి..
2009లో ఏర్ప‌డిన కాకినాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ అక్క‌డ గెలిచింది. ప్ర‌జారాజ్యం త‌ర‌పున క‌న్న‌బాబు విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ మ‌ద్ద‌తుతో టీడీపీ కూట‌మి అభ్య‌ర్థి పిల్లి అనంత‌ల‌క్ష్మి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి క‌న్న‌బాబు మ‌రోసారి నెగ్గారు. ఇక పిఠాపురంలో 2009లో ప్ర‌జారాజ్యం నుంచి వంగా గీత‌, 2014లో టీడీపీ అభ్య‌ర్థి ఎస్‌వీఎస్ఎన్ శ‌ర్మ నెగ్గారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి దొర‌బాబు గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపు బ‌లం ఎక్కువ‌గా ఉంది. అందుకే చిరంజీవి పార్టీ ప్ర‌జారాజ్యం నేత‌లు ఇక్క‌డ గ‌తంలో విజ‌యాలు సాధించారు. ముఖ్యంగా పిఠాపురం అయితే త‌న‌కు సుర‌క్షిత‌మ‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఆయ‌న చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

This post was last modified on March 26, 2022 1:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

39 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago