ఏపీ ప్రధాన పప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికలపై తీవ్రస్తాయిలో కసరత్తు చేస్తోంది. ఎలా వెళ్లాలి? ఏవిధంగా పోటీ చేసి విజయం దక్కించుకోవాలి? వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా గద్దె దింపాలి? అనే అంశాలపై తీవ్రం గానే ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకుపా ర్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే.. మెజారిటీ తమ్ముళ్లు మాత్రం.. వద్దని అంటున్నారు. అందునా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే.. మేం పార్టీ ని గెలిపించుకుంటాం! అనే వాదన వినిపిస్తోంది.
మరి దీనికి కారణాలు ఏంటి? చంద్రబాబు ఎందుకు జనసేనతో పొత్తులు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. అంటే.. ఒకటి.. తమ్ముళ్లలో కసిపెరిగింది. పార్టీ నేతలపై ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాలు కానీ, పోలీసులు పెడుతున్న కేసులు కానీ.. కార్యకర్తలను తీవ్రంగా బాధిస్తోంది. అదేసమయంలో ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఈ పరిణామం ఇబ్బందులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే వారు.. ఇక, పార్టీని అధికారంలోకి తెచ్చు కునే సమయం వచ్చిందని అంటున్నారు.
ఇదే కసితో వారు పనిచేసేందుకు కూడా రెడీ అవుతున్నారు.. అందుకే.. ఎలాంటి పొత్తు అవసరం లేదని తాము పార్టీని గెలుపు గుర్రం ఎక్కిస్తామని అంటున్నారు. అయితే.. దీనికి భిన్నంగా చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే.. టీడీపీపై నమ్మకం లేక కాదు.. వైసీపీకి ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలోనూ.. పార్టీకి బలం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వారంతా కూడా వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.
దీంతో చిన్నపామునైనా.. పెద్దకర్రతో కొట్టాలనే చందంగా.. మరింత బలంగా ఎన్నికల్లో పావులు కదిపేందుకు జనసేనతో కలిసి ముందుకు వెళ్తే తప్పేంటని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.. కానీ, క్షేత్రస్థాయి నుంచి మాత్రం ఒంటరిగానే వెళ్దామనే ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 24, 2022 6:36 pm
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…