ఏపీ ప్రధాన పప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికలపై తీవ్రస్తాయిలో కసరత్తు చేస్తోంది. ఎలా వెళ్లాలి? ఏవిధంగా పోటీ చేసి విజయం దక్కించుకోవాలి? వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా గద్దె దింపాలి? అనే అంశాలపై తీవ్రం గానే ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకుపా ర్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే.. మెజారిటీ తమ్ముళ్లు మాత్రం.. వద్దని అంటున్నారు. అందునా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే.. మేం పార్టీ ని గెలిపించుకుంటాం! అనే వాదన వినిపిస్తోంది.
మరి దీనికి కారణాలు ఏంటి? చంద్రబాబు ఎందుకు జనసేనతో పొత్తులు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. అంటే.. ఒకటి.. తమ్ముళ్లలో కసిపెరిగింది. పార్టీ నేతలపై ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాలు కానీ, పోలీసులు పెడుతున్న కేసులు కానీ.. కార్యకర్తలను తీవ్రంగా బాధిస్తోంది. అదేసమయంలో ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఈ పరిణామం ఇబ్బందులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే వారు.. ఇక, పార్టీని అధికారంలోకి తెచ్చు కునే సమయం వచ్చిందని అంటున్నారు.
ఇదే కసితో వారు పనిచేసేందుకు కూడా రెడీ అవుతున్నారు.. అందుకే.. ఎలాంటి పొత్తు అవసరం లేదని తాము పార్టీని గెలుపు గుర్రం ఎక్కిస్తామని అంటున్నారు. అయితే.. దీనికి భిన్నంగా చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే.. టీడీపీపై నమ్మకం లేక కాదు.. వైసీపీకి ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలోనూ.. పార్టీకి బలం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వారంతా కూడా వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.
దీంతో చిన్నపామునైనా.. పెద్దకర్రతో కొట్టాలనే చందంగా.. మరింత బలంగా ఎన్నికల్లో పావులు కదిపేందుకు జనసేనతో కలిసి ముందుకు వెళ్తే తప్పేంటని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.. కానీ, క్షేత్రస్థాయి నుంచి మాత్రం ఒంటరిగానే వెళ్దామనే ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 24, 2022 6:36 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…