Political News

తెలంగాణ: విద్యుత్ ఛార్జీలతో షాక్

తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. పేద, మధ్య, ధనిక వర్గాలనే తేడా లేకుండా ప్రభుత్వం అందరినీ సమానంగా భావించి ఛార్జీల పెంపుతో బాదేసింది. యూనిట్ కు సగటున 10 పైసల నుండి 50 పైసలవరకు వీరబాదుడు బాదింది. నివాసలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలన్న తేడా లేకుండా అన్నీ క్యాటగిరిల వాడకానికి చార్జీలను పెంచేసింది. దీనివల్ల బిల్లులు భారీగా రాబోతున్నట్లు జనాల్లో టెన్షన్ మొదలైపోయింది.

గతంలో ఎప్పుడూ లేనంతగా ఛార్జీల పెంపు వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 5596 కోట్ల అదనపు భారాన్ని జనాలపై ప్రభుత్వం మోపింది. ప్రస్తుత విద్యుత్ ఛార్జీలను 18 శాతం పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి కోరితే విద్యుత్ నియంత్రణ మండలి జనాలపై కాస్త జాలి చూపించి 14 శాతం పెంపుకు మాత్రమే అనుమతించింది. కేసీయార్ ప్రభుత్వం వచ్చిన ఎనిమిదేళ్ళల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటం ఇది మూడోసారి.

దేశంలోనే తెలంగాణా అత్యంత ధనిక రాష్ట్రమని మాటిమాటికి డప్పు కొట్టుకునే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచుతున్నదో అర్థం కావటం లేదు. ఒకవైపు అత్యంత చవకైన జల విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రభుత్వమే చెప్పుకుంటోంది. చవకైన జల విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంటున్నపుడు విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందో అర్థం కావటం లేదు. మరి ఉత్పత్తవుతున్న జలవిద్యుత్ ఎటుపోతోంది ?

శ్రీశైలం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల్లాంటి వాటి నుండి భారీగానే జల విద్యుత్ జరుగుతున్నట్లు గతంలో ప్రభుత్వమే చెప్పింది. వ్యవసాయ వాడకానికి మీటర్లు పెట్టేది లేదని ఇప్పటికే కేసీయార్ తేల్చిచెప్పారు. మరి వ్యవసాయానికి ఎంత విద్యుత్ వాడుతున్నది తేలకపోతే విద్యుత్ ఉత్పత్తి, వాడకంలో లెక్కలు సక్రమంగా ఎలా తేలుతాయి. ఏంటో పాలకులు చెప్పేదొకటి, చేసేదొకటిగా అయిపోతోంది. విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల సామర్థ్యం పెంచుకోవటం, సరఫరాలో లీకేజీలు లేకుండా చూసుకుంటు వినియోగాన్ని క్రమపద్దతిలో పెట్టకపోతే  ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసినా ఉపయోగముండదు. వినియోగాదారులను ఛార్జీల పెంపుతో మోత మొగిస్తుండాల్సిందే.

This post was last modified on March 24, 2022 6:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

57 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago