Political News

ప‌వ‌న్ లేకుండా బీజేపీ ఏం చేస్తుంది?

దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల‌కు పైగా స‌మ‌యం ఉంది. అందులో భాగంగానే 2024లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. కానీ ఇప్ప‌టి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాజ‌కీయ పార్టీలు వేడి రాజేస్తున్నాయి. ఏపీలో రాజ‌కీయాలు ఇప్ప‌టికే ఊపందుకున్నాయి. పొత్తులు, సీట్ల వ్య‌వ‌హారంపై అప్పుడే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. సీఎం జ‌గ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించేందుకు విప‌క్షాలు ఏకమ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే పొత్తులో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ మాత్రం ఎన్నిక‌ల‌కు ముందు విడిపోయేలా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇటీవ‌ల జ‌నసేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ బీజేపీ పేరెత్త‌లేదు. వైసీపీని ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అందుకు అంద‌రూ క‌లిసి రావాల‌ని మాత్ర‌మే ఆయ‌న పేర్కొన్నారు. సొంత ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో పొత్తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో జ‌న‌సేన‌, టీడీపీ ఎన్నిక‌ల‌కు ముందు పొత్తు కుదుర్చుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీ స‌సేమిరా ఒప్పుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌, బీజేపీ విడిపోయే అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన తాజా వ్యాఖ్య‌లు కూడా అందుకు ఊత‌మిస్తున్నాయి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేసేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే గ‌తంలో రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై క‌లిసి పోరాడ‌తామ‌ని జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి మీడియాకు చెప్పాయి. కానీ ఇప్పుడు కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ఒంటరిగా పోరాటానికి సై అనేలా క‌నిపిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు వైసీపీని ఓడించేందుకు బీజేపీ రోడ్‌ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్న‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. కానీ వీర్రాజు మాత్రం రెండు నెల‌ల క్రిత‌మే అమిత్ షా త‌మ‌కు తిరుప‌తిలో రోడ్ మ్యాప్ ఇచ్చార‌ని చెప్పారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు విరుద్ధంగా వీర్రాజు మాట్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే త‌మ‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా ప‌వ‌న్ సాగుతున్నార‌ని, మ్యానిఫెస్టో కూడా ప్ర‌క‌టించార‌ని బీజేపీ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కానీ ప‌వ‌న్‌ను కాద‌నుకుని ఏపీలో బీజేపీ ఏం సాధిస్తుంది? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. జాతీయ స్థాయిలో జోష్ త‌ప్ప ఆ పార్టీకి ఏపీలో క్యాడ‌ర్ కూడా లేదు. క్షేత్ర‌స్థాయిలో ఎలాంటి బ‌లం లేదు. పైగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఏపీకి అన్యాయం చేస్తుంద‌నే ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పొత్తుతో కాకుండా సింగిల్‌గా బీజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తే ఎలాంటి ఫ‌లితం ఉండ‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

This post was last modified on March 17, 2022 6:00 pm

Share

Recent Posts

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

7 minutes ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

5 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

6 hours ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

9 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

11 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

11 hours ago