Political News

ప‌వ‌న్ అంటే పేర్నినానికి ఎందుకింత భ‌యం!

రాజ‌కీయ యుద్ధంలో ఒక్క‌డ్నే వ‌స్తా అని అంటున్నారు జ‌గ‌న్.. ఆయ‌న త‌రుఫున ఒక్క‌డే ఆ మాట కూడా అంటున్నారు ఆయ‌నే పేర్ని నాని. ప‌వ‌న్ స్పీచ్ అవ్వ‌గానే మంత్రి మాటలు కొన్ని ఆయ‌న అభద్ర‌తాభావానికి సంకేతాలు అని అంటున్నాయి జ‌న‌సేన వ‌ర్గాలు. తాము అంద‌రినీ గౌర‌విస్తామ‌ని ఆ కోవ‌లో మంత్రి కూడా ఉంటార‌ని అయితే త‌ప్పులు చేస్తే భ‌రించేంత శ‌క్తి కానీ ఓపిక కానీ లేవ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు ప‌వ‌న్. ఇదే మాట నిన్న ప‌దే ప‌దే చెప్పారు స‌హ‌జ వ‌న‌రుల దోపిడీని ఆప‌డం జ‌న‌సేన ముందున్న క‌ర్త‌వ్యం అని ప‌దే ప‌దే అన్నారు.

దీనిపై పేర్ని నాని ఎందుకు మాట్లాడ‌రు అని విధాన సంబంధ నిర్ణ‌యాల‌పై మాట్లాడ‌కుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఆయ‌నెందుకు ఫోకస్ చేస్తార‌ని మండిప‌డుతున్నారు జ‌న‌సైనికులు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని జ‌న‌సేన అంటే ఎందుకింత భ‌యం అనిఅంటున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. త‌మ ద‌గ్గ‌ర ఆస్తులు లేవు అని ఆత్మాభిమానం మెండుగా ఉంద‌ని నిన్న‌టి వేళ మ‌రోమారు చెప్పే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు.

ముఖ్యంగా ఇది ఆధిప‌త్యానికి ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం అని తేల్చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ చెప్పిన ప్ర‌తిమాట‌కూ పేర్నినాని కౌంట‌ర్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.ఎన్ని క‌ల‌లు క‌న్నా కూడా జ‌గ‌న్ ను దాటి గెలుపు సాధించి తీర‌డం అసాధ్యం అని తేల్చేశారు. బీజేపీనీ టీడీపీనీ క‌లిపి ఉంచేందుకే ప‌వ‌న్ సిద్ధం అవుతున్నారా? అన్న‌ది నాని ప్ర‌శ్న.దీనిపై కూడా జ‌న‌సేన కౌంట‌ర్లు ఇస్తోంది.

2014లో ఆ రోజు తాము క‌లిసి ప‌నిచేయ‌డం  వ‌ల్ల‌నే స్థిర‌మ‌యిన రీతిలో ప్ర‌భుత్వం ఏర్పాటు సాధ్యం అయింద‌ని,అయినా కూడా రాజ‌ధాని గ్రామాల  రైతుల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశామ‌ని గుర్తు చేస్తున్నారు.తాము మద్ద‌తు ఇచ్చినంత మాత్రాన పోరాటం ఆప‌బోమ‌ని మ‌రో మారు స్ప‌ష్టం చేస్తున్నారు ప‌వ‌న్ మ‌రియు ఆయ‌న అభిమానులు కూడా! జీవితం ఇచ్చిన చిరంజీవిని మ‌రిచిపోవ‌డం అస్స‌లు జ‌ర‌గ‌ని ప‌ని అని అంటోంది ప‌వ‌న్ వ‌ర్గం. అన్ని వేడుక‌ల్లోనూ వేదిక‌ల‌పై ఆయ‌న పేరు ప్ర‌స్తావించ‌నంత మాత్రాన గౌర‌వం లేదు అని ఎలా అనుకుంటారు..కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయండి అవేవీ నెగ్గ‌వు అని కూడా  అంటున్నారు జ‌న‌సేన అభిమానులు. 

This post was last modified on March 15, 2022 4:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

26 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

2 hours ago