Political News

ఆ విషయంపై నోరు విప్పిన పవన్

వైసీపీ హ‌యాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. తొలిసారి.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ ఆర్థిక అరాచ‌కాల‌పై స్పందించారు. అసెంబ్లీలో బ‌డ్జెట్‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో  కీల‌క ప్ర‌సంగం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశ‌నం చేసింద‌ని.. దీంతో రాష్ట్రం 30 ఏళ్ల‌పాటు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశార‌ని వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో 9 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు అప్పులు చేశార‌ని.. మరో 35 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టి వెళ్లారన్నారు. ఇప్పుడు వాటికి వ‌డ్డీలు క‌ట్టేందుకే.. సొమ్ములు స‌రిపోవ‌డం లేద‌న్నారు. పెండింగులో పెట్టిన బిల్లుల‌ను నెమ్మ‌దిగా క్లియ‌ర్ చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 25 కోట్ల‌రూపాయ‌ల మేర‌కు బిల్లులను చెల్లించామ‌న్నారు. కేంద్రం నుంచి వ‌చ్చే ప‌థ‌కాల‌ను కూడా వైసీపీ ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టి రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేసింద‌న్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం 90 శాతం నిధులు ఇచ్చే ప‌థ‌కాల‌కు కూడా 10 శాతం రాష్ట్ర వాటా ఇవ్వ‌కుండా వైసీపీ వెన‌క్కి త‌గ్గింద‌ని.. దీంతో ఆయా ప‌థ‌కాలు ఆగిపోయాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు కేంద్రాన్ని ఒప్పించి దాదాపు 75 ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. వాటికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ వివ‌రించారు. దీనివ‌ల్లే రాష్ట్రంలో అభివృద్ధి ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌న్నారు.

రాష్ట్ర బ‌డ్జెట్‌పై ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం ఆర్థిక ప‌రిస్థితి  ఇబ్బందుల్లో ఉన్న‌ప్ప‌టికీ.. 3.32 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్‌ను అన్ని రంగాల‌కు, అన్ని వ‌ర్గాల‌కు స‌మాన ప్రాధాన్యం క‌ల్పిస్తూ.. రూపొందించార‌ని ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌ను మెచ్చుకున్నారు. ఎంతో అనుభ‌వం ఉంటే త‌ప్ప‌.. ఇలా చేయ‌లేర‌ని కొనియాడారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం న్యాయ‌శాఖ‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు ప‌వ‌న్ వివ‌రించారు. అమ‌రావ‌తిలో హైకోర్టు నిర్మాణంతోపాటు.. జిల్లాల వారిగా కూడా కోర్టుల‌ను నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on March 7, 2026 5:21 am

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

1 hour ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

3 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

4 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

4 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

6 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

7 hours ago