వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చం అని చెప్పారాయన అంటే ఇది ఫిక్స్ పొత్తులుంటాయని! అంతేకాదు తానేం చెప్పాలనుకుంటున్నానో వాటిపై కూడా క్లారిటీ ఇచ్చారు.ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని చెప్పడంతో సంబంధిత వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి.పవన్ గెలిచినా ఓడినా తామంతా ఆయన వెంటే ఉంటామని ఇవాళ సభా నిర్వహణకు స్థలం ఇచ్చి, వచ్చినవాళ్ళందరి ఆకలి తీర్చి, దాహార్తి తీర్చి మంచి మనసు చాటుకున్న ఇప్పటం గ్రామస్థులు అంటున్నారు.
పవన్ స్పీచ్ లో ఫుల్ క్లారిటీ ఉండడంతో పసుపు పార్టీ పెద్దలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు వీడి రాష్ట్రప్రయోజనాలే ధ్యేయంఅనుకుంటే తప్పక తాము ఏ పార్టీతో అయినా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు పవన్.పవన్ స్పీచ్ తరువాత ఏపీ మంత్రుల్లో అలజడులు ప్రారంభం అయ్యాయి.అప్పుడే పేర్ని నాని స్పందించి కౌంటర్లు దాఖలు చేశారు మీడియా ముఖంగా..!
ఆవిర్భావం అంటే జస్ట్ స్వీట్లు పంచుకుని వెళ్లిపోవడం కాదు అని ప్రూవ్ చేశారు జనసేనాని నిన్నటివేళ. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటిలానే అరుపులు గోలలు ఉన్నా వాటిని చాలా తీవ్రంగా వ్యతిరేకించి నివారించి అభిమానులను నియంత్రించేందుకు ఎంతగానో ప్రయత్నించి సఫలీకృతం అయ్యారు.ఆ దిశగా పవన్ తాను చెప్పాలనుకున్నది చెప్పారు. అరుపులు కేకలు కాదు బాధ్యత కావాలి..మీరు బాధ్యతగా నడుచుకోండి చాలు అన్న అర్థం వచ్చేలా మీ అత్యుత్సాహం నాకు ఆనందం ఇవ్వదు..ఇలాంటివే తగ్గించుకుంటే మేలు.. సీఎం సీఎం అన్న అరుపులు వద్దు అని అంటూనే.. సుతిమెత్తగా చురకలు అంటించారు అభిమానులకు.. ఈ సందర్భంలో సీఎం సీఎం అన్న కేకలకు స్పందిస్తూ అది అయినప్పుడు చూద్దాంలే ముందు మీరు బాధ్యతగా ఉండండి చాలు అని అన్నారాయన.
నిన్నటివేళ పవన్ లో మార్పు కనిపించింది.అదే పనిగా అరిచి ఆవేశంతో ఊగిపోవడం వద్దనుకున్నారాయన.తనదైన శైలిలో మాట్లాడుతూనే భిన్న రీతిలో కొన్ని విషయాలపై హుందాగా స్పందించారు. ముఖ్యంగా రాజధానుల విషయమై క్లారిటీ ఇచ్చారు. రాజు మారినంత మాత్రాన రాజధానులు మారిపోవు..మారకూడదు కూడా ! అన్న స్పష్టత పవన్ లో ఉంది. ఇదే స్పష్టత జగన్ ను ఆకట్టుకుంటుందో లేదా ఆలోచింపజేస్తుందో అన్నది చూడాలి. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూనే, రాజధాని సమస్యపై ఆ రోజు తాను ఏ విధంగా స్పందించానన్నది ఆధారాలతో సహా వివరించారు. ఈ కార్యక్రమంలో హైలెట్ ఏంటంటే సభా నిర్వహణకు సహకరించిన ఇప్పటం గ్రామానికి పవన్ తన వంతుగా ఇక్కడిఅభివృద్ధి పనులకు యాభై లక్షల రూపాయల విరాళం ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు.ఇప్పుడిదే స్పీచ్ కన్నా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on March 15, 2022 10:51 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…