Political News

కేజ్రీవాల్ స్పీడు  మామూలుగా లేదే

ఢిల్లీతో మొదలై తాజాగా పంజాబ్ లో జెండా ఎగరేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తన తర్వాత టార్గెట్ ను గుజరాత్ గా ఫిక్స్ చేసింది. పంజాబ్ అద్భుతమైన విజయంతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లుంది. అందుకనే ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలే తమ తర్వాత టార్గెట్ అని ప్రకటించారు.

గుజరాత్ లో పాగా వేయటానికి వీలుగా ఏప్రిల్ నుంచి  రాష్ట్రం మొత్తం అన్నీ జిల్లాలు, మండలాల్లో తిరంగా యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. గుజరాత్ లో బీజేపీ ఎంత బలంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే బీజేపీ బలానికి ప్రత్యర్ధి పార్టీల బలహీనతే అని కేజ్రీవాల్ బలంగా నమ్ముతున్నారు. గుజరాత్ లో దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఎన్నికల్లో ఢీ కొడుతున్నాయి. అంటే అక్కడ చెప్పుకోదగ్గ ప్రాంతీయ పార్టీ కానీ లేదా మూడో జాతీయ పార్టీ కానీ లేదని అర్ధమైపోతోంది.

బీజేపీ దెబ్బకు దాదాపు 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పూర్తిగా దెబ్బ తినేసింది. అందుకనే ఆప్ గుజరాత్ పైన దృష్టిపెట్టింది. పంజాబ్ లో కూడా దాదాపు గుజరాత్ పరిస్దితే ఉంది. ఇక్కడే కాంగ్రెస్ లేదా శిరోమణి అకాలీదళ్ మాత్రమే ఎన్నికల్లో ఢీ కొంటున్నాయి. ఇక్కడ బీజేపీ ఉన్నా ఏదో గెస్ట్ ఆర్టిస్టుగా మాత్రమే ఉంటోంది. అందుకనే పంజాబ్ పై ఆప్ దృష్టి పెట్టి 8 ఏళ్ళల్లో అధికారంలోకి వచ్చింది. ముందు స్ధానిక సంస్థల ఎన్నికల్లోకి దిగింది. తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసింది. ఇపుడు ఏకంగా అధికారంలోకే వచ్చేసింది.

అలాగే గుజరాత్ లో కూడా గట్టి ప్రతిపక్ష స్థానాన్ని ముందు భర్తీ చేసి తర్వాత అధికారంలోకి వస్తామని కేజ్రీవాల్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే గుజరాత్ లోని కొన్ని మున్సిపాలిటిల్లో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా అక్కడక్కడ ఆప్ నేతలు గెలిచారు. కాబట్టి ఆప్ ఊపు చూస్తుంటే తొందరలోనే గుజరాత్ లో కూడా కాంగ్రెస్ ను ముందు చాపచుట్టేసేట్లే ఉంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.

This post was last modified on March 12, 2022 1:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

39 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago