Political News

కేజ్రీవాల్ స్పీడు  మామూలుగా లేదే

ఢిల్లీతో మొదలై తాజాగా పంజాబ్ లో జెండా ఎగరేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తన తర్వాత టార్గెట్ ను గుజరాత్ గా ఫిక్స్ చేసింది. పంజాబ్ అద్భుతమైన విజయంతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లుంది. అందుకనే ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలే తమ తర్వాత టార్గెట్ అని ప్రకటించారు.

గుజరాత్ లో పాగా వేయటానికి వీలుగా ఏప్రిల్ నుంచి  రాష్ట్రం మొత్తం అన్నీ జిల్లాలు, మండలాల్లో తిరంగా యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. గుజరాత్ లో బీజేపీ ఎంత బలంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే బీజేపీ బలానికి ప్రత్యర్ధి పార్టీల బలహీనతే అని కేజ్రీవాల్ బలంగా నమ్ముతున్నారు. గుజరాత్ లో దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఎన్నికల్లో ఢీ కొడుతున్నాయి. అంటే అక్కడ చెప్పుకోదగ్గ ప్రాంతీయ పార్టీ కానీ లేదా మూడో జాతీయ పార్టీ కానీ లేదని అర్ధమైపోతోంది.

బీజేపీ దెబ్బకు దాదాపు 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పూర్తిగా దెబ్బ తినేసింది. అందుకనే ఆప్ గుజరాత్ పైన దృష్టిపెట్టింది. పంజాబ్ లో కూడా దాదాపు గుజరాత్ పరిస్దితే ఉంది. ఇక్కడే కాంగ్రెస్ లేదా శిరోమణి అకాలీదళ్ మాత్రమే ఎన్నికల్లో ఢీ కొంటున్నాయి. ఇక్కడ బీజేపీ ఉన్నా ఏదో గెస్ట్ ఆర్టిస్టుగా మాత్రమే ఉంటోంది. అందుకనే పంజాబ్ పై ఆప్ దృష్టి పెట్టి 8 ఏళ్ళల్లో అధికారంలోకి వచ్చింది. ముందు స్ధానిక సంస్థల ఎన్నికల్లోకి దిగింది. తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసింది. ఇపుడు ఏకంగా అధికారంలోకే వచ్చేసింది.

అలాగే గుజరాత్ లో కూడా గట్టి ప్రతిపక్ష స్థానాన్ని ముందు భర్తీ చేసి తర్వాత అధికారంలోకి వస్తామని కేజ్రీవాల్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే గుజరాత్ లోని కొన్ని మున్సిపాలిటిల్లో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా అక్కడక్కడ ఆప్ నేతలు గెలిచారు. కాబట్టి ఆప్ ఊపు చూస్తుంటే తొందరలోనే గుజరాత్ లో కూడా కాంగ్రెస్ ను ముందు చాపచుట్టేసేట్లే ఉంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.

This post was last modified on March 12, 2022 1:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

21 minutes ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

2 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

2 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

5 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

6 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

7 hours ago