సమంత, అనుష్క.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఈ మధ్యకాలంలో సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా గడుపుతోంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేయడానికి అంగీకరిస్తుంది. మరోపక్క అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న ఓ సినిమాలో అనుష్క కనిపించనుంది.
అయితే ఇప్పటివరకు ఈ సినిమాను మొదలుపెట్టలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ బయోపిక్ లో నటించమని అనుష్కని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే బయోపిక్ సమంత దగ్గరకు కూడా వెళ్లిందట. ఇంతకీ ఆ బయోపిక్ ఏంటంటే.. ‘బెంగుళూరు నాగరత్నమ్మ’ స్టోరీ.
దర్శకుడు సింగీతం శ్రీనివాసరరావు చాలా కాలంగా ఈ బయోపిక్ తీయాలనుకుంటున్నారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం 90 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు సింగీతం. ఇదొక దేవదాసి కథ. ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ సబ్జెక్ట్ గా దీన్ని రూపొందించారు. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా రైటర్ గా పని చేస్తున్నారు. డైలాగ్ వెర్షన్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. నాగరత్నమ్మ క్యారెక్టర్ లో ముందుగా సమంతను అనుకున్నారు. ఆమెకి కథ కూడా వినిపించారు.
కానీ ఈ సినిమా విషయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అదే కథను అనుష్కకు కూడా వినిపించారట. కథ నచ్చినప్పటికీ.. ఇంకాస్త సమయం కావాలని అడిగిందట అనుష్క. వీరిద్దరిలో ఎవరు ఓకే చెప్పినా.. వెంటనే ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు సింగీతం శ్రీనివాసరావు. ఇలాంటి కథలో అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తేనే బాగుంటుందనేది సింగీతం ఆలోచన. మరి వీరిద్దరిలో ఈ బయోపిక్ కి ఎవరు ఓకే చెబుతారో చూడాలి!
This post was last modified on March 12, 2022 3:00 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…