సమంత, అనుష్క.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఈ మధ్యకాలంలో సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా గడుపుతోంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేయడానికి అంగీకరిస్తుంది. మరోపక్క అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న ఓ సినిమాలో అనుష్క కనిపించనుంది.
అయితే ఇప్పటివరకు ఈ సినిమాను మొదలుపెట్టలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ బయోపిక్ లో నటించమని అనుష్కని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే బయోపిక్ సమంత దగ్గరకు కూడా వెళ్లిందట. ఇంతకీ ఆ బయోపిక్ ఏంటంటే.. ‘బెంగుళూరు నాగరత్నమ్మ’ స్టోరీ.
దర్శకుడు సింగీతం శ్రీనివాసరరావు చాలా కాలంగా ఈ బయోపిక్ తీయాలనుకుంటున్నారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం 90 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు సింగీతం. ఇదొక దేవదాసి కథ. ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ సబ్జెక్ట్ గా దీన్ని రూపొందించారు. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా రైటర్ గా పని చేస్తున్నారు. డైలాగ్ వెర్షన్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. నాగరత్నమ్మ క్యారెక్టర్ లో ముందుగా సమంతను అనుకున్నారు. ఆమెకి కథ కూడా వినిపించారు.
కానీ ఈ సినిమా విషయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అదే కథను అనుష్కకు కూడా వినిపించారట. కథ నచ్చినప్పటికీ.. ఇంకాస్త సమయం కావాలని అడిగిందట అనుష్క. వీరిద్దరిలో ఎవరు ఓకే చెప్పినా.. వెంటనే ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు సింగీతం శ్రీనివాసరావు. ఇలాంటి కథలో అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తేనే బాగుంటుందనేది సింగీతం ఆలోచన. మరి వీరిద్దరిలో ఈ బయోపిక్ కి ఎవరు ఓకే చెబుతారో చూడాలి!
This post was last modified on March 12, 2022 3:00 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…