సమంత, అనుష్క.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఈ మధ్యకాలంలో సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా గడుపుతోంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేయడానికి అంగీకరిస్తుంది. మరోపక్క అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న ఓ సినిమాలో అనుష్క కనిపించనుంది.
అయితే ఇప్పటివరకు ఈ సినిమాను మొదలుపెట్టలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ బయోపిక్ లో నటించమని అనుష్కని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే బయోపిక్ సమంత దగ్గరకు కూడా వెళ్లిందట. ఇంతకీ ఆ బయోపిక్ ఏంటంటే.. ‘బెంగుళూరు నాగరత్నమ్మ’ స్టోరీ.
దర్శకుడు సింగీతం శ్రీనివాసరరావు చాలా కాలంగా ఈ బయోపిక్ తీయాలనుకుంటున్నారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం 90 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు సింగీతం. ఇదొక దేవదాసి కథ. ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ సబ్జెక్ట్ గా దీన్ని రూపొందించారు. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా రైటర్ గా పని చేస్తున్నారు. డైలాగ్ వెర్షన్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. నాగరత్నమ్మ క్యారెక్టర్ లో ముందుగా సమంతను అనుకున్నారు. ఆమెకి కథ కూడా వినిపించారు.
కానీ ఈ సినిమా విషయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అదే కథను అనుష్కకు కూడా వినిపించారట. కథ నచ్చినప్పటికీ.. ఇంకాస్త సమయం కావాలని అడిగిందట అనుష్క. వీరిద్దరిలో ఎవరు ఓకే చెప్పినా.. వెంటనే ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు సింగీతం శ్రీనివాసరావు. ఇలాంటి కథలో అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తేనే బాగుంటుందనేది సింగీతం ఆలోచన. మరి వీరిద్దరిలో ఈ బయోపిక్ కి ఎవరు ఓకే చెబుతారో చూడాలి!
This post was last modified on March 12, 2022 3:00 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…