జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆంధప్రదేశ్ అధికార వైసీపీ ప్రభుత్వం పవన్పై కక్ష్యతో ఈ సినిమాకు ఆటంకాలు సృష్టించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయినా పవన్ తన పవర్ చూపించారని జనసైనికులు చెబుతున్నారు. టికెట్ రేట్ల విషయంలో, అదనపు షో విషయంలో భీమ్లానాయక్ చిత్రంపై ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరించిదనే విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా పవన్ సోదరుడు నాగబాబు కూడా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పవన్ మీద వ్యక్తిగత కక్ష్య తీర్చుకుంటుందని నాగబాబు విమర్శలు చేశారు. కక్ష్య సాధింపు ఆలోచనలు ఉంటే మొత్తం సినీ పరిశ్రమపై కాకుండా తనపై తీర్చుకోవాలని రిపబ్లిక్ చిత్ర వేడుకలో పవన్ అన్నారని.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అదే చేస్తుందని నాగబాబు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం పవన్ను లక్ష్యంగా చేసుకుందనే విషయం భీమ్లానాయక్ చిత్రంతో స్పష్టమైందని ఆయన తెలిపారు. సినీ పెద్దలు కలిసినప్పుడు త్వరలోనే కొత్త జీవో తెస్తామని చెప్పిన జగన్ ఆ పని చేయలేదని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చిత్ర పరిశ్రమలోని ఇతర హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. ఇలా ఎంతో మంది ఉన్నప్పటికీ వైసీపీకి భయపడి పవన్కు మద్దతుగా నిలవడం లేదని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ హీరోకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఇది తప్పు అని ఎవరూ చెప్పకపోవడం చాలా బాధకరమని ఆయన చెప్పారు. వాళ్ల భయాలను, బలహీనతలను, అభద్రతాభావాన్ని అర్థం చేసుకున్నామని నాగబాబు అన్నారు. వాళ్లు మాకు సహకరించకపోయినా పరిశ్రమలో ఎవరికి ఇలాంటి సమస్య వచ్చినా తాము కచ్చితంగా నిలబడతామని నాగబాబు వెల్లడించారు.
This post was last modified on February 27, 2022 6:13 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…