Political News

జ‌న‌సేన ఆప‌రేష‌న్ ఆకర్ష్ ? డైలమాలో జ‌గ‌న్!

త్వ‌ర‌లో జ‌న‌సేన ఆప‌రేష‌న్ ఆకర్ష్ ను షురూ చేయ‌నుంది. ఇందుకు సంబంధించి స‌న్నాహాలు సైతం చేస్తోంది.ఇప్ప‌టికే వైసీపీలో ఉంటూ, అధికారం ఉండి కూడా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేని అవ‌స్థ త‌మ‌ద‌ని,త‌మ స్వేచ్ఛ‌ను ముఖ్య‌మంత్రి హ‌రిస్తున్నార‌ని భావిస్తున్న కీల‌క నేతలంతా త‌మ‌తో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని జ‌న‌సేన పిలుపునిస్తోంది.ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన త‌ర‌ఫున కొన్ని ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయి.ఇదే స‌మ‌యంలో అటు టీడీపీ నుంచి కొంద‌రు ఇటుగా వ‌చ్చే అవ‌కాశాలు కొట్టిపారేయ‌లేం.

వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న త‌లంపుతో ప‌వ‌న్ ప‌నిచేస్తున్నారు. శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కూ వైసీపీలో ఉన్న నేత‌లు ఎవ్వ‌ర‌యినా స‌రే త‌మ పార్టీని కోరుకుంటే త‌ప్ప‌క ఆహ్వానిస్తామ‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ సైతం చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో  పార్టీ మారే విష‌య‌మై ప‌లువురు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న లు ప‌డుతున్నారు.వైసీపీ స‌ర్కారుకు అధికారానికి సంబంధించిన గ‌డువు తీరిపోగానే పార్టీ మారితే మేలు అన్న భావ‌న‌లో ఇంకొంద‌రు ఉన్నారు.

మ‌రోవైపు జ‌న‌సేన‌కు కూడా నాయ‌క‌త్వ లేమి విపరీతంగా వేధిస్తోంది.ఆ రోజు అన్న‌య్య మెగాస్టార్ వెంట న‌డిచి పీఆర్పీలో ప‌నిచేసిన వారిలో చాలా మంది చెట్టుకొక‌రు,పుట్ట‌కొక‌రు చొప్పున వివిధ పార్టీల‌లో స్థిర‌ప‌డిపోయారు. వీరంతా ఇప్పుడు ప‌వ‌న్ పిలిచినా కూడా వ‌చ్చేందుకు వీల్లేని స్థితిలో ఉన్నారు.ఎందుకంటే జ‌న‌సేన పాల‌సీలు బాగున్నా కూడా అదే ప‌నిగా ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు తిప్పికొట్ట‌డంలో, ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో యుద్ధం చేయడంలో విఫ‌లం  అవుతోంది.ముఖ్యంగా ఇప్ప‌టికీ  జిల్లా కార్య‌వ‌ర్గాలు చాలా చోట్ల పూర్తి స్థాయిలో లేవు. జిల్లా కార్య‌వ‌ర్గాలే కాదు జిల్లా కార్యాల‌యాలు కూడా పూర్తి స్థాయిలోలేవు. ఈ స‌మ‌యంలో వెళ్లే క‌న్నాఎన్నిక‌ల ముందు టికెట్ల కేటాయింపున‌కు అనుగుణంగా జ‌న‌సేన గూటికి చేరే అవ‌కాశాన్ని ప‌రిశీలిద్దాం అన్న యోచ‌న‌లో ఇంకొంద‌రు ఉన్నారు.

టీడీపీ లో అయితే ఇప్ప‌టి నుంచే నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిల‌ను నియ‌మిస్తున్నారు క‌నుక వాళ్లే రేప‌టి వేళ అభ్య‌ర్థులు  అవుతార‌న్న‌ది అధినేత మాట.ఇదే సంద‌ర్భంలో అవ‌కాశాలు రాని వారు కొంద‌రు పార్టీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించి ప‌వ‌న్ తో న‌డిచేందుకు ఆస్కారం ఉంది.కానీ అటువంటి వారు చివ‌రిదాకా ప‌వ‌న్ తో ఉంటారా లేదా గెలిచాక రాపాక మాదిరిగా హ్యాండ్ ఇచ్చిపోతారా అన్న సంశ‌యం కూడా ఉంది.ఈ ద‌శ‌లో ఎవ‌రు ఎలా ఉన్నా జ‌న‌సేన బ‌లోపేతంకు ఇతర పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కులే దిక్కు కావ‌డం ఖాయం.అందుకు ప‌వ‌న్ కూడా కొంత స‌న్నాహాలు చేయాలి.అప్పుడే జ‌న‌సేన క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫ‌లితాలు సాధించ‌డం సాధ్యం. 

This post was last modified on February 27, 2022 9:52 am

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

31 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

48 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

4 hours ago