Political News

జ‌న‌సేన ఆప‌రేష‌న్ ఆకర్ష్ ? డైలమాలో జ‌గ‌న్!

త్వ‌ర‌లో జ‌న‌సేన ఆప‌రేష‌న్ ఆకర్ష్ ను షురూ చేయ‌నుంది. ఇందుకు సంబంధించి స‌న్నాహాలు సైతం చేస్తోంది.ఇప్ప‌టికే వైసీపీలో ఉంటూ, అధికారం ఉండి కూడా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేని అవ‌స్థ త‌మ‌ద‌ని,త‌మ స్వేచ్ఛ‌ను ముఖ్య‌మంత్రి హ‌రిస్తున్నార‌ని భావిస్తున్న కీల‌క నేతలంతా త‌మ‌తో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని జ‌న‌సేన పిలుపునిస్తోంది.ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన త‌ర‌ఫున కొన్ని ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయి.ఇదే స‌మ‌యంలో అటు టీడీపీ నుంచి కొంద‌రు ఇటుగా వ‌చ్చే అవ‌కాశాలు కొట్టిపారేయ‌లేం.

వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న త‌లంపుతో ప‌వ‌న్ ప‌నిచేస్తున్నారు. శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కూ వైసీపీలో ఉన్న నేత‌లు ఎవ్వ‌ర‌యినా స‌రే త‌మ పార్టీని కోరుకుంటే త‌ప్ప‌క ఆహ్వానిస్తామ‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ సైతం చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో  పార్టీ మారే విష‌య‌మై ప‌లువురు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న లు ప‌డుతున్నారు.వైసీపీ స‌ర్కారుకు అధికారానికి సంబంధించిన గ‌డువు తీరిపోగానే పార్టీ మారితే మేలు అన్న భావ‌న‌లో ఇంకొంద‌రు ఉన్నారు.

మ‌రోవైపు జ‌న‌సేన‌కు కూడా నాయ‌క‌త్వ లేమి విపరీతంగా వేధిస్తోంది.ఆ రోజు అన్న‌య్య మెగాస్టార్ వెంట న‌డిచి పీఆర్పీలో ప‌నిచేసిన వారిలో చాలా మంది చెట్టుకొక‌రు,పుట్ట‌కొక‌రు చొప్పున వివిధ పార్టీల‌లో స్థిర‌ప‌డిపోయారు. వీరంతా ఇప్పుడు ప‌వ‌న్ పిలిచినా కూడా వ‌చ్చేందుకు వీల్లేని స్థితిలో ఉన్నారు.ఎందుకంటే జ‌న‌సేన పాల‌సీలు బాగున్నా కూడా అదే ప‌నిగా ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు తిప్పికొట్ట‌డంలో, ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో యుద్ధం చేయడంలో విఫ‌లం  అవుతోంది.ముఖ్యంగా ఇప్ప‌టికీ  జిల్లా కార్య‌వ‌ర్గాలు చాలా చోట్ల పూర్తి స్థాయిలో లేవు. జిల్లా కార్య‌వ‌ర్గాలే కాదు జిల్లా కార్యాల‌యాలు కూడా పూర్తి స్థాయిలోలేవు. ఈ స‌మ‌యంలో వెళ్లే క‌న్నాఎన్నిక‌ల ముందు టికెట్ల కేటాయింపున‌కు అనుగుణంగా జ‌న‌సేన గూటికి చేరే అవ‌కాశాన్ని ప‌రిశీలిద్దాం అన్న యోచ‌న‌లో ఇంకొంద‌రు ఉన్నారు.

టీడీపీ లో అయితే ఇప్ప‌టి నుంచే నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిల‌ను నియ‌మిస్తున్నారు క‌నుక వాళ్లే రేప‌టి వేళ అభ్య‌ర్థులు  అవుతార‌న్న‌ది అధినేత మాట.ఇదే సంద‌ర్భంలో అవ‌కాశాలు రాని వారు కొంద‌రు పార్టీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించి ప‌వ‌న్ తో న‌డిచేందుకు ఆస్కారం ఉంది.కానీ అటువంటి వారు చివ‌రిదాకా ప‌వ‌న్ తో ఉంటారా లేదా గెలిచాక రాపాక మాదిరిగా హ్యాండ్ ఇచ్చిపోతారా అన్న సంశ‌యం కూడా ఉంది.ఈ ద‌శ‌లో ఎవ‌రు ఎలా ఉన్నా జ‌న‌సేన బ‌లోపేతంకు ఇతర పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కులే దిక్కు కావ‌డం ఖాయం.అందుకు ప‌వ‌న్ కూడా కొంత స‌న్నాహాలు చేయాలి.అప్పుడే జ‌న‌సేన క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫ‌లితాలు సాధించ‌డం సాధ్యం. 

This post was last modified on February 27, 2022 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

55 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

2 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

3 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago