Political News

ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా సీమ రెడ్డి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `బీమ్లా నాయక్‌` ఓ వైపు విడుద‌ల‌కు స‌ర్వం సిద్ధం చేసుకోగా మ‌రోవైపు టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని మౌఖిక ఆదేశాలు వెలువ‌రించడం సంచ‌ల‌నంగా మారింది. టికెట్‌ ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్ర‌భుత్వం హెచ్చరికలు జారీ చేయ‌డంపై సినీ వ‌ర్గాలు, ప‌వ‌న్ ఫ్యాన్స్ స్పందిస్తుండ‌గా తాజాగా రాయ‌ల‌సీమ‌కు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రియాక్ట‌య్యారు.

సినిమాలపై సీఎం జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎం టార్గెట్ చేశారని పేర్కొన్న జేసీ ఈ చ‌ర్య‌తో ప‌వ‌న్‌కు న‌ష్టం ఏం ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తుంటే ఏపీ ప్ర‌భుత్వం మాత్రం క‌క్ష గ‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు.

తాజాగా భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజ‌రై తెలంగాణ‌లో షూటింగ్‌ల కోసం అందుబాటులో ఉన్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకోవాల‌ని కోరిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే, ఏపీలో మాత్రం సినిమాల‌ను టార్గెట్ చేసే విధంగా టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో పేచీ న‌డుస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుకు మేము వ్యతిరేకం కాదు.. కానీ ముందే చెప్పాలి కదా అని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలిపారు.

భీమ్లానాయ‌క్ సినిమా విడుద‌ల విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేసింద‌ని  జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆరోపించారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, ఇక నుంచి ఏ హీరో, డైరెక్టర్ రాష్ట్రంలో సినిమా తీయరని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి సిని ప‌రిశ్ర‌మ‌కు మేలు చేసే చ‌ర్య‌లు కోరారే కానీ ఆయన బతకలేక సీఎం జ‌గ‌న్ దగ్గరకు రాలేద‌న్నారు. సినిమా పరిశ్రమ కోసం చిరంజీవి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌డం స‌రైంద‌ని కాద‌ని  జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

This post was last modified on February 24, 2022 7:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

28 minutes ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

47 minutes ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

2 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

2 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

3 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

3 hours ago