Political News

ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా సీమ రెడ్డి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `బీమ్లా నాయక్‌` ఓ వైపు విడుద‌ల‌కు స‌ర్వం సిద్ధం చేసుకోగా మ‌రోవైపు టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని మౌఖిక ఆదేశాలు వెలువ‌రించడం సంచ‌ల‌నంగా మారింది. టికెట్‌ ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్ర‌భుత్వం హెచ్చరికలు జారీ చేయ‌డంపై సినీ వ‌ర్గాలు, ప‌వ‌న్ ఫ్యాన్స్ స్పందిస్తుండ‌గా తాజాగా రాయ‌ల‌సీమ‌కు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రియాక్ట‌య్యారు.

సినిమాలపై సీఎం జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎం టార్గెట్ చేశారని పేర్కొన్న జేసీ ఈ చ‌ర్య‌తో ప‌వ‌న్‌కు న‌ష్టం ఏం ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తుంటే ఏపీ ప్ర‌భుత్వం మాత్రం క‌క్ష గ‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు.

తాజాగా భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజ‌రై తెలంగాణ‌లో షూటింగ్‌ల కోసం అందుబాటులో ఉన్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకోవాల‌ని కోరిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే, ఏపీలో మాత్రం సినిమాల‌ను టార్గెట్ చేసే విధంగా టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో పేచీ న‌డుస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుకు మేము వ్యతిరేకం కాదు.. కానీ ముందే చెప్పాలి కదా అని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలిపారు.

భీమ్లానాయ‌క్ సినిమా విడుద‌ల విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేసింద‌ని  జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆరోపించారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, ఇక నుంచి ఏ హీరో, డైరెక్టర్ రాష్ట్రంలో సినిమా తీయరని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి సిని ప‌రిశ్ర‌మ‌కు మేలు చేసే చ‌ర్య‌లు కోరారే కానీ ఆయన బతకలేక సీఎం జ‌గ‌న్ దగ్గరకు రాలేద‌న్నారు. సినిమా పరిశ్రమ కోసం చిరంజీవి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌డం స‌రైంద‌ని కాద‌ని  జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

This post was last modified on February 24, 2022 7:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

13 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

36 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

45 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago