పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `బీమ్లా నాయక్` ఓ వైపు విడుదలకు సర్వం సిద్ధం చేసుకోగా మరోవైపు టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని మౌఖిక ఆదేశాలు వెలువరించడం సంచలనంగా మారింది. టికెట్ ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంపై సినీ వర్గాలు, పవన్ ఫ్యాన్స్ స్పందిస్తుండగా తాజాగా రాయలసీమకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్టయ్యారు.
సినిమాలపై సీఎం జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్ను ఏపీ సీఎం టార్గెట్ చేశారని పేర్కొన్న జేసీ ఈ చర్యతో పవన్కు నష్టం ఏం ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
తాజాగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరై తెలంగాణలో షూటింగ్ల కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఏపీలో మాత్రం సినిమాలను టార్గెట్ చేసే విధంగా టికెట్ల ధరల విషయంలో పేచీ నడుస్తోందని ఆయన మండిపడ్డారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుకు మేము వ్యతిరేకం కాదు.. కానీ ముందే చెప్పాలి కదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
భీమ్లానాయక్ సినిమా విడుదల విషయంలో పవన్ కళ్యాణ్ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇక నుంచి ఏ హీరో, డైరెక్టర్ రాష్ట్రంలో సినిమా తీయరని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి సిని పరిశ్రమకు మేలు చేసే చర్యలు కోరారే కానీ ఆయన బతకలేక సీఎం జగన్ దగ్గరకు రాలేదన్నారు. సినిమా పరిశ్రమ కోసం చిరంజీవి వచ్చినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం సరైందని కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
This post was last modified on February 24, 2022 7:30 pm
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…