ఆంధ్రావనిలో అటు అంగన్ వాడీలు ఇటు ఆశావర్కర్లు వరుస నిరసనలతో హోరెత్తించారు. సోమవారం నాడు అంగన్ వాడీ కార్యకర్తలంతా కనీస వేతనాలు 26 వేలుగా నిర్ణయించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కోవిడ్ టైంలో ప్రాణాలు విడిచిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని కోరుతూ రోడ్డెక్కారు. దీంతో జిల్లా కలెక్టరేట్లు అన్నీ నిరసనలతో దద్దరిల్లిపోయాయి.చాలా చోట్ల పోలీసు నిర్బంధాలను దాటి మరీ! అంగన్ వాడీలు రోడ్డెక్కారు. కానీ ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున మరో ప్రకటన వచ్చింది.
అదేంటంటే అంగన్ వాడీలను గ్రేడ్ 2 సూపర్ వైజర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వు వచ్చింది. దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడిచింది. సోషల్ మీడియాలో జగన్ సర్కారు నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించగా ఇంకొందరు సమర్థించారు. ఇదే సమయాన జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని కోరుతూ ఓ వాట్సాప్ మెసేజ్ రావడంతో సంబంధిత వర్గాలు విస్తుబోయాయి.
దీంతో సంఘ నేతలు ఇలాంటివేవీ వద్దని మరో వాట్సాప్ మెసేజ్ ఇవ్వడంతో ఓ గందరగోళ వాతావరణం నెలకొంది. జీతాల పెంపుపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది తెలియకుండా చాలీ చాలని వేతనాలతో కనీసం సంక్షేమ పథకాలకు సైతం నోచుకోకుండా తాము ఎంత కాలం అని వెట్టి చాకిరీ చేయాలని వీరంతా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆశావర్కర్లు కూడా తమ గొంతుక వినిపిస్తున్నారు. గౌరవ వేతనాన్ని 15 వేలకు పెంచాలని, కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన (విధులు నిర్వర్తిస్తూ) పది లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిన్నటి వేళ కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు ఉపక్రమించి, తమ వేదన వెల్లడించారు.ఇదే సమయంలో ఆశా వర్కర్లను నిలువరించి ధర్నాలకు రాకుండా వారిని నియంత్రించి రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల మందిని అరెస్టు చేశారని సంబంధిత యూనియన్లు గగ్గోలు పెడుతున్నాయి.
విశాఖ,గుంటూరు, విజయనగరం తో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అతి కారణంగా ఆశా వర్కర్లు పడరాని పాట్లు పడ్డారని, తమతో ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ వీరంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రు.ముఖ్యంగా ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలను అమలు చేయడంతో పోలీసులు వీలున్నంత వరకూ ధర్నాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు.అయినా సరే చాలా మంది తమ యూనిఫాం అయిన తెల్ల చీరల్లో కాకుండా వేరే రంగు చీరలు కట్టుకుని, వేర్వేరు మార్గాల్లో కలెక్టరేట్లకు చేరుకుని ధర్నాల్లో పాల్గొని తమ ఆకాంక్షలు వెల్లడించారు.
This post was last modified on February 23, 2022 1:43 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…