Political News

ఎన్నాళ్లయింది ఇలాంటి దృశ్యాలు చూసి…

కరోనా మహమ్మాది దెబ్బకు ఇది అది అని తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ స్తబ్దత నెలకొంది. జనాలకు వినోదాన్నందించే అతి ముఖ్యమైన రంగాలైన సినిమాలు, ఆటలు మూడు నెలల కిందట్నుంచి బంద్ అయ్యాయి. కనీసం ఓటీటీల్లో కొత్త సినిమాలైనా చూసే అవకాశం ఉంటోంది కానీ.. ఆటలకు సంబంధించి అయితే కొత్త వినోదం ఏమీ లేదు.

పాత సినిమాలు చూసినట్లు పాత ఆటల వీడియోలు చూసి సంతృప్తి చెందలేరు క్రీడా ప్రేమికులు. వాళ్లకు అత్యంత వినోదాన్నందించేది లైవ్ మ్యాచ్‌లే. అవి లేక కొన్ని నెలలుగా అల్లాడిపోతున్నారు స్పోర్ట్స్ లవర్స్. ముఖ్యంగా స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూడటం అలవాటైన వాళ్లకు పిచ్చెక్కిపోతూ ఉంది. ఈ మధ్య కొన్ని దేశాల్లో కొన్ని ఆటలు పున:ప్రారంభం అయినప్పటికీ.. చాలా వరకు అభిమానుల్ని స్టేడియాలకు అనుమతించకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఏమో పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల్ని అనుమతిస్తున్నారు.

దీంతో మళ్లీ స్టేడియాలు నిండుగా కనిపించే రోజులు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు స్పోర్ట్స్ లవర్స్. ఐతే న్యూజిలాండ్‌లో మళ్లీ ఆ దృశ్యం కనిపించింది. కరోనాపై పోరాటంలో ఆ దేశం అద్భుత విజయం సాధించింది. లాక్ డౌన్‌ను పక్కాగా అమలు చేయడం, జనాలు కూడా ప్రభుత్వానికి సహకరించడంతో 20 రోజులుగా న్యూజిలాండ్‌లో కొత్త కరోనా కేసులేవీ లేవు. వాళ్లు పెట్టుకున్న గడువు కంటే ముందే న్యూజిలాండ్ కరోనా ఫ్రీ అయిపోయింది. దీంతో దేశంలో అన్ని కార్యకలాపాలూ పున:ప్రారంభం అయ్యాయి. ఆటలకూ అనుమతులొచ్చాయి. అభిమానుల విషయంలోనూ షరతులేమీ లేవు. పూర్తి స్టేడియాల్ని నింపేసుకోవచ్చు. అక్కడ రగ్బీ ప్రధాన ఆట. ఆ ఆటలో జరిగే సూపర్ రగ్బీ టోర్నీ చాలా పాపులర్.

ఈ టోర్నీలో భాగంగా శనివారం ఓ మ్యాచ్ నిర్వహిస్తే 23 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం కళకళలాడింది. ఇక ఆదివారం నాడు బ్లూస్, హరికేన్స్ మధ్య ఆక్లాండ్‌లో మ్యాచ్ పెడితే.. రెస్పాన్స్ మామూలుగా లేదు. 41 వేల మందితో పూర్తిగా స్టేడియం నిండిపోయింది. అంత మంది కోలాహలం మధ్య మ్యాచ్ అద్భుతంగా సాగిపోయింది. సంబంధిత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూజిలాండ్ అభిమానుల అదృష్టం చూసి.. తమ దగ్గరా ఇలాంటి రోజులు ఎప్పుడొస్తాయో అనుకుంటున్నారు మిగిలిన దేశాల స్పోర్ట్స్ లవర్స్.

This post was last modified on June 15, 2020 4:17 pm

Share
Show comments
Published by
Satya
Tags: Newzealand

Recent Posts

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

2 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

2 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

3 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

3 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

5 hours ago