Political News

తొలిసారి కాంగ్రెస్ సంచలన నిర్ణయం !

చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా ? జరిగిన పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పంజాబ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీనే సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీయే ఉంటారని రాహుల్ చేసిన ప్రకటన తెలివైనదే. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలని పీసీసీ అధ్యక్షుడు, వివాదాస్పద నేత నవ్ జోత్ సింగ్ సిద్ధూ ఎప్పటినుండో కోరుకుంటున్నారు.

అసలు కెప్టెన్ను సీఎంగా అధిష్టానం తప్పించినపుడే తాను సీఎం అవుతానని సిద్ధూ అనుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం సిద్ధూకి షాక్ ఇచ్చి చన్నీని కుర్చీలో కూర్చోబెట్టింది. అప్పటినుండి ప్రతిరోజు ఏదో విషయంలో చన్నీని సిద్ధూ వేపుకు తినేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే రాష్ట్రంలో దళితుల ఓట్లు సుమారు 31 శాతం ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున దళితులున్నారు కాబట్టే వారిని ఆకర్షించేందుకు అధిష్టానం చన్నీని సీఎంను చేసింది.

రాష్ట్రంలో మొదటిసారి ఎస్సీని ముఖ్యమంత్రిని చేసిన క్రెడిట్ కాంగ్రెస్ కే దక్కింది. దాంతో కొన్ని దళిత సంఘాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నాయి. అయితే చన్నీని ఏదో కారణంతో సిద్ధూ టార్గెట్ చేస్తునే ఉన్నారు. దాంతో పార్టీలో అంత:కలహాలు బాగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జనాల్లో దూసుకుపోయింది. జనాధరణ ఉన్న భగవంత్ సింత్ మాన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది. అధికారంలోకి రాబోయేది ఆప్ మాత్రమే అని ఇప్పటికే అనేక సర్వేల్లో తేలింది.

అందుకనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చన్నీని రంగంలోకి దింపింది. కుర్చీలో కూర్చుని కొంతకాలమే అయినా చన్నీకి జనాల్లో మంచి పేరే వచ్చింది. చన్నీకి మంచి పేరొచ్చి కాంగ్రెస్ కుదురుకునే కొద్దీ విజయావకాశాలు ఆప్ కు తగ్గిపోతాయి. ఈ నేపధ్యంలోనే సీఎం అభ్యర్ధిగా చన్నీని నియమించటం మంచి ఎత్తుగడనే చెప్పాలి. మరి దీనికి సిద్ధు ఎంతవరకు సహకరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on February 7, 2022 3:15 pm

Share
Show comments

Recent Posts

సందీప్ కిషన్ సినిమాలో ఫాదర్ ట్విస్టు

రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…

2 hours ago

మహాసేన రాజేష్.. మళ్లీ యుటర్న్

మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…

3 hours ago

నా దగ్గర డబ్బు లేదు-జగన్

దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…

3 hours ago

నారా లోకేష్ కోసం.. రోడ్డెక్కిన‌ నంద‌మూరి కుటుంబం !

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త…

3 hours ago

అంబటికి మళ్లీ అల్లుడి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…

3 hours ago

ఆర్ఆర్ఆర్ ఇప్పుడు అవసరమంటారా

ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…

6 hours ago