Political News

రోజా క్లారిటీ ఇచ్చినట్లేనా?

తన రాజీనామాపై నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా క్లారిటీ ఇచ్చేసింది. తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లు, రాజీనామా చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన ప్రత్యర్ధులపై సెటైర్లు వేశారు. తానంటే భయపడుతున్న వారే తనపై ఇలాంటి పనికిమాలిన ప్రచారాలు చేయిస్తున్నట్లు మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి అభిమానిగా, మద్దతుదారుగా తాను పార్టీలో ఉంటానని, బతికున్నంత వరకు మరో పార్టీలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. తనకు ఎంఎల్ఏగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటు జనాలనే ప్రశ్నించారు. తన ప్రత్యర్థులు కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపోయారు. తాను ఇసుకను దొంగతనంగా అమ్ముకుంటున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్న విషయం తనకు బాగా తెలుసన్నారు.

ఇసుకనో మరొకటో అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. రెండుసార్లు ఎంఎల్ఏగా  గెలిపించిన వైసీపీని వదిలి పెట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. జగన్ కష్టాల్లో ఉన్నపుడు  తాను అండగా నిలిచిన విషయం అందరికీ తెలుసన్నారు. అందరూ పల్లె ప్రాంతాల నుంచి నగరాలకు, పట్టణాలకు వెళిపోతుంటే తాను చెన్నై, హైదరాబాద్ మహానగరాల నుండి నగిరికి వచ్చిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. నగిరిలో తాను ఇల్లు కట్టుకున్నాను కాబట్టి తాను ఎప్పటికీ నగిరిలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.

పార్టీ మార్పు, ఎంఎల్ఏగా రాజీనామా విషయాలపై రోజా క్లారిటీ ఇవ్వటం వరకు బాగానే ఉంది కానీ తన నోటిదురుసు మాటేమిటి అనే చర్చ ప్రత్యర్ధులు నిలదీస్తున్నారు. రోజాకు దూకుడు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దూకుడు కారణంగానే ప్రత్యర్ధి పార్టీలతో పాటు పార్టీలో కూడా శతృవులు పెరిగిపోతున్నారు. నియోజకవర్గంలో ఎటుచూసినా ప్రత్యర్ధుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుండే జనాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని రెగ్యులర్ గా జనాల్లోనే ఉంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on February 7, 2022 1:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

1 hour ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago