Trends

క్రికెట్ హీరోల కోసం ల‌తాజీ చేసిన గొప్ప ప‌ని

అండ‌ర్-19 ప్ర‌పంచ‌కప్ గెలిచిన కుర్రాళ్ల‌కు బీసీసీఐ తాజాగా ఒక్కొక్క‌రికి రూ.40 ల‌క్ష‌ల చొప్పున న‌జ‌రానా ప్ర‌క‌టించింది. టీనేజీలో ఉన్న కుర్రాళ్ల‌కే ఇంతింత న‌జ‌రానాలంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. త‌మ రాష్ట్రాల‌కు చెందిన కుర్రాళ్ల‌కు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వేర్వేరుగా క్యాష్ ప్రైజ్‌లు ఇస్తున్నాయి. ఇక వీరికి ఐపీఎల్ వేలంలోనూ భారీగానే రేటు ప‌లికే అవ‌కాశ‌ముంది. ఇప్పుడు క్రికెట్లో పేరు సంపాదిస్తే ఇలా క‌న‌క వ‌ర్షం కురుస్తుంది.

కానీ నాలుగు ద‌శాబ్దాల కింద‌ట ఈ ప‌రిస్థితి లేదు. 1983లో భీక‌ర వెస్టిండీస్‌ను గెలిచి ఇండియాకు వ‌స్తే సన్మాన కార్య‌క్ర‌మం చేయ‌డానికి కూడా బీసీసీఐ ద‌గ్గ‌ర స‌రిప‌డా డ‌బ్బులు లేవు. అంత పెద్ద విజ‌యం సాధిస్తే ఇక న‌జ‌రానాల గురించి ఏం చెప్పాలి. ఆ స్థితిలో వారికి లెజెండ‌రీ సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ చేసిన సాయం మ‌రువ‌రానిది.

క్రికెట్‌ను అమితంగా ఇష్ట‌ప‌డే ల‌తా.. అప్ప‌టి ప్ర‌పంచ‌క‌ప్ హీరోలకు సాయం చేయ‌డానికి న‌డుం బిగించింది. బీసీసీఐ విజ్ఞ‌ప్తి మేర‌కు ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో.. ఆమె భారీ సంగీత విభావ‌రి నిర్వ‌హించింది. ఈ క‌న్స‌ర్ట్ ద్వారా బీసీసీఐ అనుకున్న‌దానికంటే ఎక్కువ నిధులే వ‌చ్చాయి. త‌ర్వాత అదే స్టేడియంలో ల‌త స‌మ‌క్షంలో క‌పిల్ డెవిల్స్‌కు స‌న్మానం జ‌రిగింది. జ‌ట్టులో స‌భ్యుల్లో ఒక్కొక్క‌రికి రూ.ల‌క్ష చొప్పున బీసీసీఐ న‌జ‌రానాలు అందించింది. ఆ రోజుల్లో అదే పెద్ద మొత్తం.

ఆ త‌ర్వాత భార‌త క్రికెట్ ఇంతింతై అన్న‌ట్లుగా ఎలా ఎదిగిందో.. ఇప్పుడు క్రికెట‌ర్లు ఏ స్థాయిలో ఉన్నారో.. వారికి ఎంతెంత న‌జ‌రానాలు అందుతున్నాయో తెలిసిందే. ఇక ల‌తాకు భార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ అంటే అమిత‌మైన ఇష్టం. అత‌డిని ఆమె కొడుకులా చూసేది. అత‌ను ఆమెను అమ్మ అనేవాడు. 2011 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో సెమీస్ సంద‌ర్భంగా భార‌త్ గెలుపు కోసం ల‌త రోజంతా ఉప‌వాసం ఉండ‌టం విశేషం.

This post was last modified on February 7, 2022 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

1 hour ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

9 hours ago