మారుతున్న కాలానికి తగ్గట్లు మార్పు చేసుకోవటానికి మించింది ఉండదు. కానీ.. ఆ విషయాన్ని చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత మాత్రమే గుర్తించినట్లుంది కాంగ్రెస్ పార్టీ. దేశానికి ఆ పార్టీ మంచి ఎంతో చేసిందో.. మరికొంత చెడు చేసింది. బ్యాడ్ లక్ ఏమంటే.. దేశానికి ఆ పార్టీ చేసిన మేలు కంటే.. చేసిన తప్పులే ఇప్పుడు చాలామందికి భూతద్దంలో కనిపిస్తున్నాయి. సీల్డ్ కవర్ కల్చర్ ను దేశానికి పరిచయం చేసి.. అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్న పార్టీ అధినాయకత్వం.. మరెక్కడో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిని డిసైడ్ చేయటమే తప్పించి.. ప్రజల్లో ఎవరికి ఎంత పట్టు ఉందన్న విషయాన్ని పట్టించుకునేది కాదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా.. తన సీల్డ్ కవర్ సంస్కృతి మార్చుకున్నా బాగుండేది. కానీ.. అలాంటిదేమీ చేయలేదు కాంగ్రెస్. అధికారానికి దూరమై.. మోడీ మేజిక్ తో అంతకంతకూ తేలిపోతున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఉనికి కోసం పోరాడే పరిస్థితుల్లోకి వెళ్లిపోతోంది. ఇలాంటివేళలో.. తన తీరును మార్చుకుంటున్న సంకేతాల్ని ఇస్తూ.. షాకింగ్ నిర్ణయాల్ని ప్రకటిస్తోంది. ఎన్నికల వేళలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయానికి ఒకప్పుడు అస్సలు ఇష్టపడేది కాదు కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించిన తర్వాత కూడా.. కొద్ది రోజులు నానబెట్టి.. స్థానికంగా ఉండే గ్రూపులు కొట్టుకు చచ్చే వేళలో సీన్లోకి ఎంటరై.. పంచాయితీ చేసి.. సీల్డ్ కవర్ తో ఇష్యూను క్లోజ్ చేసే సిత్రమైన అలవాటును ప్రదర్శించటం తెలిసిందే.
ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. తన తీరును మాత్రం మార్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పంజాబ్ రాష్ట్రంలో తమ పార్టీ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రిగా నియమించేది ఎవరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ అంశంపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా దానికి చెక్ పెట్టేస్తూ.. సీఎం అభ్యర్థిని ప్రకటించేశారు.
ప్రస్తుతం పంజాబ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చరణ్ జీత్ సింగ్ చన్నీ వైపునే పార్టీ మొగ్గు చూపింది. ‘సీఎం అభ్యర్థిని నియమించటం ఇబ్బందికర పరిస్థితే. పేదల కష్టాన్ని ఒక పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారని పంజాబ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకే చన్నీనే పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎన్నికల వేళలోనే సీఎం అభ్యర్థిని ప్రకటించే ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on February 7, 2022 1:44 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…