మారుతున్న కాలానికి తగ్గట్లు మార్పు చేసుకోవటానికి మించింది ఉండదు. కానీ.. ఆ విషయాన్ని చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత మాత్రమే గుర్తించినట్లుంది కాంగ్రెస్ పార్టీ. దేశానికి ఆ పార్టీ మంచి ఎంతో చేసిందో.. మరికొంత చెడు చేసింది. బ్యాడ్ లక్ ఏమంటే.. దేశానికి ఆ పార్టీ చేసిన మేలు కంటే.. చేసిన తప్పులే ఇప్పుడు చాలామందికి భూతద్దంలో కనిపిస్తున్నాయి. సీల్డ్ కవర్ కల్చర్ ను దేశానికి పరిచయం చేసి.. అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్న పార్టీ అధినాయకత్వం.. మరెక్కడో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిని డిసైడ్ చేయటమే తప్పించి.. ప్రజల్లో ఎవరికి ఎంత పట్టు ఉందన్న విషయాన్ని పట్టించుకునేది కాదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా.. తన సీల్డ్ కవర్ సంస్కృతి మార్చుకున్నా బాగుండేది. కానీ.. అలాంటిదేమీ చేయలేదు కాంగ్రెస్. అధికారానికి దూరమై.. మోడీ మేజిక్ తో అంతకంతకూ తేలిపోతున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఉనికి కోసం పోరాడే పరిస్థితుల్లోకి వెళ్లిపోతోంది. ఇలాంటివేళలో.. తన తీరును మార్చుకుంటున్న సంకేతాల్ని ఇస్తూ.. షాకింగ్ నిర్ణయాల్ని ప్రకటిస్తోంది. ఎన్నికల వేళలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయానికి ఒకప్పుడు అస్సలు ఇష్టపడేది కాదు కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించిన తర్వాత కూడా.. కొద్ది రోజులు నానబెట్టి.. స్థానికంగా ఉండే గ్రూపులు కొట్టుకు చచ్చే వేళలో సీన్లోకి ఎంటరై.. పంచాయితీ చేసి.. సీల్డ్ కవర్ తో ఇష్యూను క్లోజ్ చేసే సిత్రమైన అలవాటును ప్రదర్శించటం తెలిసిందే.
ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. తన తీరును మాత్రం మార్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పంజాబ్ రాష్ట్రంలో తమ పార్టీ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రిగా నియమించేది ఎవరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ అంశంపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా దానికి చెక్ పెట్టేస్తూ.. సీఎం అభ్యర్థిని ప్రకటించేశారు.
ప్రస్తుతం పంజాబ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చరణ్ జీత్ సింగ్ చన్నీ వైపునే పార్టీ మొగ్గు చూపింది. ‘సీఎం అభ్యర్థిని నియమించటం ఇబ్బందికర పరిస్థితే. పేదల కష్టాన్ని ఒక పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారని పంజాబ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకే చన్నీనే పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎన్నికల వేళలోనే సీఎం అభ్యర్థిని ప్రకటించే ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on February 7, 2022 1:44 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…