‘జంప్ జిలానీ’ల భయంతో గోవా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. గత అయిదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులతో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ… వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో బరిలో నిలవనున్న అభ్యర్థులతో ప్రమాణం చేయించింది. తాము గెలిస్తే పార్టీ మారమని భగవంతునిపై ఒట్టు వేయించింది. అంతేకాదు.. ఇలా ఒట్టు పెట్టిన వారికి మాత్రమే టికెట్ ఇస్తామని.. ముందుగానే సందేశాలు పంపించింది. దీనికి సిద్ధమైన వారికి మాత్రమే టికెట్ ఇస్తామని.. ఈ విషయంలో ఎవరి సిఫారసులు అవసరంలేదని.. గోవా కాంగ్రెస్ పేర్కొంది. దీంతో నాయకులు ఒప్పుడు ప్రమాణాల బాట పట్టారు.
ఒట్టు పార్టీ మారం.. అంటూ.. ప్రమాణం చేసేందుకు సిద్ధపడిన వారికి మాత్రమే టికెట్లు ఇచ్చిన గోవా కాంగ్రెస్.. ఇందుకోసం ఎన్నికల బరిలోకి దిగనున్న మొత్తం 34 మంది అభ్యర్థులను ప్రత్యేక బస్ లో రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు, చర్చ్లకు, దర్గాలకు (అభ్యర్థుల సంప్రదాయాను సారం) తీసుకుని వెళ్లి.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడమని దేవుని ఎదుట ప్రమాణం చేయించారు కాంగ్రెస్ పెద్దలు.
కాంగ్రెస్ నుంచి ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న సీనియర్ నాయకుడు చిదంబరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాస్తవానికి గత 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయాలి. కానీ, రెండు సీట్లు మాత్రమే తగ్గాయి. ఇంతలో బీజేపీ అరంగేట్రం చేసి.. కాంగ్రెస్ అభ్యర్థులను తనవైపు మళ్లించుకుంది. దీంతో దక్కాల్సిన అధికారం కాంగ్రెస్కు దూరమైంది. దీంతో ఇప్పుడు అభ్యర్థులపై నమ్మకం లేకనో.. లేక.. ఇలా అయినా.. కట్టుబడి ఉంటారనో.. కాంగ్రెస్ ఇప్పుడు ఒట్టు రాజకీయాలకు తెరదీసింది. అయితే..దీనిపై కాంగ్రెస్ మరో వాదన వినిపిస్తోంది.
అభ్యర్థులతో ప్రమాణం చేయించడంపై ప్రజల మనసుల్లో నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఇలా దేవుని ముందు ప్రమాణం చేయించినట్లు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ చెప్పారు. గోవాలో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ అత్యధికంగా 17 సీట్లలో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఒక్కొక్కరు పార్టీని వీడగా.. ప్రస్తుతం వారి సంఖ్య ఇద్దరికి పరిమితం అయ్యింది. 2019లో ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరారు.
This post was last modified on January 24, 2022 3:49 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…