మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో తాను క్యాసినో ఆడించినట్లుగా రుజువు చేస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అని వ్యాఖ్యానించారు. క్యాసినో అంటే ఏంటో టీడీపీ నేత, చంద్రబాబు కుమారుడు లోకేశ్కు తెలుసని అన్నారు. తనకు చెందిన కల్యాణ మండపంలో కేసినో ఆడిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. వర్ల రామయ్య, బొండా ఉమా లాంటి వ్యక్తులను నిజనిర్ధారణకు పంపుతారా అని ప్రశ్నించారు. గుడివాడలో ఏదో జరుగుతోందని చెప్తే తానే నిలుపుదల చేయించానని స్పష్టం చేశారు. గుడివాడలో తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
ఇదిలావుంటే, నిజనిర్ధారణ కోసం టీడీపీ బృందం గుడివాడకు చేరుకున్న సమయంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య పోటాపోటీ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దీంతో గుడివాడలో ఉద్రిక్తత ఏర్పడింది. సంక్రాంతి సందర్భంగా.. గుడివాడలోని కే-కన్వెన్షన్లో మంత్రి కొడాలి క్యాసినోలు నిర్వహించారంటూ.. టీడీపీ బృందం నిజనిర్థరణకు వెళ్లగా.. వారిని వెనక్కి పంపాలంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గుడివాడ పార్టీ కార్యాలయం నుంచి కే-కన్వెన్షన్కు బయల్దేరిన నేతలను.. నెహ్రూ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకోగా.. ఆ పక్క వీధిలో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి.
ఇరువర్గాల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బలవంతంగా టీడీపీ బృందాన్ని వాహనాల్లో ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో నిజనిర్ధారణ బృందంలోని నాయకులను అరెస్టు చేశారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బొండా ఉమ కారు అద్దాన్ని పగలగొట్టారు. గుడివాడ పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాళ్లు రువ్వారు. వైసీపీ శ్రేణులను పోలీసులు కనీసం నిలువరించలేదని టీడీపీ నేతలు మండిపడ్డారు.
కొడాలి నాని దొంగ: బొండా ఉమా
సొంత కన్వెన్షన్ సెంటర్లో కొడాలి నాని క్యాసినో నిర్వహించారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. “ఎన్టీఆర్ టు వైఎస్సార్ పేరిట క్యాసినో నిర్వహించారు. ఎన్టీఆర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలను సహించం. సొంత కన్వెన్షన్ సెంటర్లో గోవా సంస్కృతిని ప్రవేశపెట్టారు. హైదరాబాద్లో కరోనా చికిత్స తీసుకున్నా అంటే సరిపోతుందా?ఈ వ్యవహారం నుంచి మంత్రి కొడాలి నానిని తప్పిస్తే న్యాయపోరాటం చేస్తాం. కొడాలి నాని దొరికిపోయిన దొంగ.. వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి” అని బొండా ఉమ డిమాండ్ చేశారు.
This post was last modified on January 21, 2022 6:21 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…