రాబోయే ఎన్నికల మీద జనసేన పెద్ద ఆశలే పెట్టుకున్నట్లుంది. రాబోయే ఎన్నికల్లో తమ అధినేత పవన్ కళ్యాణే సీఎం అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బల్లగుద్దకుండానే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం ఎలా అవుతారో చెప్పమంటే అవుతారంతే అని భుజాలు ఎగరేస్తున్నారు. పవన్ సీఎం అయ్యేందుకు దోహద పడే కారణాలను చెప్పమంటే మాత్రం నోరిప్పటంలేదు.
బహశా కర్నాటకలో జేడీ (ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రయిన పద్దతిలోనే తమ అధినేత కూడా సీఎం కాకపోతారా అనే ఆశలు పెరిగిపోతున్నట్లున్నాయి. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ కు అధ్యధిక సీట్లు వచ్చాయి. వీటి తర్వాత జేడీఎస్ కు 35 సీట్లొచ్చాయి. అయితే బీజేపీని అధికారంలోకి రానీయకూడదన్న ఏకైక కారణంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు మద్దతిచ్చింది. దాంతో కుమారస్వామి ఏకంగా సీఎం అయిపోయారు.
మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. కానీ కుమారస్వామిని అదృష్టం దరిద్రం పట్టుకున్నట్లు పట్టుకోవటంతో 35 మంది ఎంఎల్ఏలతోనే సీఎం అయిపోయారు. ఏపీలో కూడా రాబోయే ఎన్నికల్లో అలాంటి పరిస్ధితి రాకుండా ఉంటుందా అప్పుడు పవన్ సీఎం అవ్వకపోతారా అని అనుకుంటున్నట్లున్నారు. ఇపుడు క్షేత్రస్థాయిలో ఉన్న లాజిక్ ప్రకారమైతే పవన్ తల్లకిందులుగా తపస్సుచేసినా సీఎం అయ్యే అవకాశమే లేదు.
మిత్రపక్షాల్లో బీజేపీకి ఉన్న బలమేంటో అందరికీ తెలుసు. అలాగే పవన్ కు పోయిన ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచారో కూడా అందరికీ గుర్తుంది. ఇలాంటి పరిస్ధితుల్లో పవన్ సీఎం అంటే కచ్చితంగా టీడీపీని కలుపుకుని వెళ్ళాల్సిందే. మరి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రిగా తాను కాకుండా మరొకరికి చంద్రబాబు ఎందుకు అవకాశం ఇస్తారు ? కాబట్టి లాజిక్ ప్రకారమైతే 2023లో పవన్ సీఎం అయ్యే అవకాశం ఎక్కడా కనబడటం లేదు. మరి జనసేనాని అదృష్టం ఎలా ఉందో మనం చెప్పలేం.
This post was last modified on January 16, 2022 7:07 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…