Political News

టికెట్ల గొడవపై మంచు విష్ణు మాట

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల గురించి కొన్ని నెలలుగా ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. దీని గురించి ఇండస్ట్రీ తరఫున చాలామంది మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంతో పరిశ్రమ తరఫున పెద్దలు వెళ్లి చర్చలు జరిపారు. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మాత్రం దీని గురించి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దీని గురించి రోజూ సోషల్ మీడియాలో మంచు విష్ణు మీద కౌంటర్లు పడుతూనే ఉంటాయి. జగన్‌కు బంధువు కూడా అయిన విష్ణు.. ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడడు, చర్చలు జరపడు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు నెటిజన్లు. ఐతే ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం మీద విష్ణు మాట్లాడాడు. ‘మా’ అధ్యక్షుడిగా వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విష్ణు ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో టికెట్ల అంశంపై అతనేమన్నాడంటే..‘‘టికెట్ల ధరల అంశంపై ఇప్పటికే ఫిలిం ఛాంబర్ తరఫున కొందరు పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.

ఇలాంటి టైంలో ‘మా’ అధ్యక్షుడి హోదాలో నేనేమైనా వారి ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడితే మొత్తం ఇష్యూని పక్కదారి పట్టించినట్లు అవుతుంది. అందుకే నేనే కాదు.. వ్యక్తిగత స్థాయిలో ఎవరూ ఈ అంశం గురించి మాట్లాడకూడదన్నది నా ఉద్దేశం. సినిమా వాళ్ల మీద మీడియా, సోషల్ మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మనం ఏం మాట్లాడినా.. దానికి వక్ర భాష్యాలు చెప్పి వివాదాస్పదం చేస్తారు.

కాబట్టి బాధ్యతతో వ్యవహరించాలి. ఒక క్రికెట్ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ప్రతి అంశం గురించి మాట్లాడరు. కేవలం కెప్టెన్ లేదా కోచ్ లేదా జట్టును నడిపించే సంస్థ ప్రతినిధులు ఆటగాళ్ల తరఫున అన్ని విషయాల మీదా మాట్లాడతారు. అలాగే ప్రస్తుతం సినీ పరిశ్రమకు చెందిన సమస్య మీద పెద్ద వాళ్లు మాట్లాడుతున్నపుడు మిగతా వాళ్లు మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని విష్ణు స్పష్టం చేశాడు.

This post was last modified on January 16, 2022 7:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago