టీడీపీ అధినేత చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం చిత్తూరులోని కుప్పంలో పార్టీని సంస్కరించే పనిలో పడ్డారు. ఆపరేషన్ క్లీన్ అప్ పేరుతో కుప్పంలో పార్టీని గాడిలో పెట్టే పనిచేపట్టారు. ముఖ్యంగా ఇప్పటి వరకుఉన్న నాయకులను నమ్మి తాను మోసపోయానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్తగా మధ్యస్థాయి నేతలను, నాయకత్వాన్నితీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఒక్క కుప్పంలోనే కాకుండా.. అన్ని ముఖ్య నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు.. పార్టీని గాడిలో పెట్టే చర్యలుచేపట్టారు.
అయితే.. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత.. మరింత దృష్టి పెట్టారని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా.. కుప్పంకు చంద్రబాబు ఎప్పుడు వచ్చినా.. కీలక నాయకులు.. బాబు పీఏ మనోహర్, మునిరత్నం, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, గౌరివాని తదితరులు ఆయన వెంటే ఉండేవారు. కానీ, గత సారి కుప్పంలో పర్యటించినప్పుడు. ఈ నేతలు.. డుమ్మా కొట్టారు. దీనికి కారణం.. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారనే కారణంగా..ఈ నేతలను పార్టీ రోజు వారి కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ.. చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం.
ఈ క్రమంలోనేఏపీ మనోహర్, మునిరత్నం, త్వరలోనే రిజైన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి మనోహర్ను తక్షణమేపార్టీ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారని.. కానీ, ఆయన ప్రత్యామ్నాయం చూసుకునే వరకు కొనసాగుతానని కోరినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వారిని వ్యూహాత్మకంగానే పక్కన పెట్టారని సమాచారం. ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు.. పార్టీ కుప్పంలో ఓటమితర్వాత .. ఇప్పటి వరకు కనిపించకపోవడం గమనార్హం.
ఇక, ఈ క్రమంలోనే చంద్రబాబు మరో ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. కుప్పం నియజకవర్గం ఇంచార్జ్గా మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ గురించి తెలిసిన నాయకుడు, రాజకీయంగా సీనియర్ కావడంతో ఆయన పార్టీని మరోసారి వ్యూహాత్మకంగా డెవలప్ చేస్తారని.. చంద్రబాబు భావిస్తున్నారు. మరి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చంద్రబాబు ఆశలను ఏమేరకు సఫలీకృతం చేస్తారో చూడాలి.
This post was last modified on January 13, 2022 6:58 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…