సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా తీయాలని ఏడాది కిందట్నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే ఘనంగా ఈ కాంబినేషన్ను అనౌన్స్ అయితే చేశారు కానీ.. దర్శకుడి విషయమే ఒక పట్టాన తేలట్లేదు. ముందుగా రజినీతో అరుణాచలం మూవీ తీసిన సీనియర్ సుందర్ను ఎంచుకున్నారు.
కానీ ఘనంగా ప్రకటన చేశాక.. రెండు వారాలు తిరిగే సరికే ఈ ప్రాజెక్టుకు తాను న్యాయం చేయలేననంటూ సుందర్ వైదొలిగారు. ఆ తర్వాత కొన్ని నెలలకు శివకార్తికేయన్తో డాన్ మూవీ తీసిన శిబి చక్రవర్తిని దర్శకుడిగా ఎంచుకున్నారు. దీని గురించి కూడా ఘనంగా ప్రకటన చేశారు. ఈ సినిమాలో రజినీ పాత్ర కోసం 80కి పైగా లుక్స్ డిజైన్ చేశాడంటూ సోషల్ మీడియాలో రజినీ ఫ్యాన్స్ శిబికి ఎలివేషన్ ఇచ్చారు.
కానీ కొన్నాళ్లకు శిబి కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఏ సమాచారం లేదు. తర్వాత రజినీ సినిమా కోసం ప్రదీప్ రంగనాథన్తో డ్రాగన్ సినిమా తీసిన అశ్వత్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. కానీ నిజంగా దర్శకుడు మారాడా లేదా అన్నది స్పష్టత లేకపోయింది.
కానీ కోలీవుడ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం రజినీ సినిమా.. అశ్వత్ మారిముత్తు చేతికే వెళ్లిందట. అతను నిర్మాత కమల్ హాసన్కు కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. శిబి చక్రవర్తి ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన సంగతి ఖాయం చేసుకోవచ్చని అంటున్నారు. కానీ శిబిని కమల్ పూర్తిగా వదిలేయట్లేదు. తన సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్లోనే వేరే అవకాశంఇస్తున్నాడట.
తన ప్రొడక్షన్లో అమరన్ సినిమా చేసిన శివకార్తికేయన్ హీరోగా.. శిబి దర్శకత్వంలో కమల్ సినిమా చేయనున్నాడట. ఇక అశ్వత్ విషయానికి వస్తే.. అతడి దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేయడానికి కొంత సమయం పడుతుందట. ఫుల్ స్క్రిప్టు రెడీ చేసి రజినీ కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాకే ఈ ప్రాజెక్టును ప్రకటించమని అశ్వత్ కోరాడట. ఒకట్రెండునెలల తర్వాత అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…