Political News

వాళ్ల పోరాటం.. ప‌వ‌న్ ఆరాటం

ప్ర‌జ‌ల కోసం పోరాడట‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి ఏడేళ్లు గ‌డిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఆయ‌న  ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్ప‌టికీ ఆయ‌న పార్టీకి కావాల్సినంత మైలేజీ రాలేద‌నేది మాత్రం నిజ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికీ జ‌న‌సేన పార్టీని ప‌రిపూర్ణ‌మైన రాజ‌కీయ పార్టీగా చూడ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకు ఎన్నో కార‌ణాలున్నాయ‌ని అంటున్నారు. ప‌వ‌న్ ఆవేశం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తార‌ని.. ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోతార‌నే విమ‌ర్శ‌లు ఓ వైపు ఉన్నాయి. మ‌రోవైపు ఏదైనా ప్ర‌జా స‌మ‌స్య‌ను త‌ల‌కెత్తుకుంటే దాని కోసం చివ‌రి వ‌ర‌కూ పోరాడ‌కుంటే మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తార‌నే అప‌వాదు కూడా ఉంది.

2014 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న జ‌న‌సేన‌.. ఇటు రాష్ట్రంలో టీడీపీకి, అటు కేంద్రంలో బీజేపీకి మ‌ద్ద‌తునిచ్చింది. ఇక 2019 ఎన్నిక‌ల్లో పోటీకి దిగి దారుణ‌మైన ఫ‌లితాలు మూట‌గ‌ట్టుకుంది. కేవ‌లం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్ర‌మే ద‌క్కించుకుంది. పోటి చేసిన రెండు చోట్లా ప‌వ‌న్ ఓడిపోయారు. అయినా ఆ ప‌రాజ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టారు. కానీ మ‌ధ్య‌లో సినిమాలు చేస్తూ తీరిక లేకుండా అయిపోయారు. దీంతో పార్టీలో జోరు క‌నిపించ‌డం లేదు. మైలేజీ రావ‌డం లేదు. ఇప్పుడా విష‌యంపై ఫోక‌స్ పెట్టిన ప‌వ‌న్ అందుకు అమ‌రావ‌తి రైతుల స‌భ‌ను ఉప‌యోగించుకోవాల‌నుకుంటున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది.

అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం ఉద్య‌మం చేస్తున్న ఆ ప్రాంత రైతుల పాద‌యాత్ర కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 17న తిరుప‌తిలో భారీ బ‌హిరంగ సభ ఏర్పాటు చేయాలని రైతులు నిర్ణ‌యించారు. అందుకు ప‌వ‌న్‌ను ముఖ్య అతిథిగా హాజ‌ర‌వ్వాల‌ని ఆహ్వానించారు. తిరుప‌తిపై ప‌వ‌న్‌కు ప్ర‌త్యేక దృష్టి ఉంది కాబ‌ట్టి ఆయ‌న ఈ స‌భ‌కు రావ‌డం ఖాయ‌మే. అందుకు గ‌తంలో త‌న అన్న చిరంజీవి తిరుప‌తిలో గెల‌వ‌డం కావొచ్చు, త‌మ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లు అక్క‌డ ఎక్కువ‌గా ఉన్నార‌నే కారణం కావొచ్చు. 2019 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న తిరుప‌తి నుంచి పోటీ చేయాల‌ని అనుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ త‌న స‌న్నిహితులు సూచ‌న మేర‌కు భీమ‌వ‌రం, గాజువాక నుంచి బ‌రిలో దిగిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప‌రిధిలో పార్టీ ప‌టిష్ఠ‌తపై ఆయ‌న ఎక్కువ‌గా దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్య‌మానికి ప‌వ‌న్ సంఘీభావం ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు అమ‌రావ‌తి రైతుల యాత్ర‌కు కూడా ఆయ‌న మ‌ద్ద‌తుగా నిల‌వబోతున్నారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు జై అమ‌రావ‌తి అన్న నేప‌థ్యంలో.. ఇప్పుడిక ప‌వ‌న్ కూడా అదే నినాదాన్ని ఎత్తుకోనున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్‌కు ఈ స‌భ పార్టీ ప‌రంగానూ క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. ఈ స‌భ పేరుతో ఆయ‌న తిరుప‌తిలో హ‌డావుడి చేసి పార్టీకి మైలేజీ పెంచాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా అన్న‌ది చూడాలి. 

Satya

Recent Posts

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

12 minutes ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

3 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

3 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

4 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

4 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

4 hours ago