Political News

మ‌ద్యంపై జ‌గ‌న్ దోపిడీ 40 వేల కోట్లు: PK

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌రించ‌డాన్ని నిర‌సిస్తూ.. దీక్ష చేప‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సాయంత్రం ఐదు గంట‌ల స‌మ‌యంలో దీక్ష విర‌మ‌ణ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. అనేక విష‌యాల‌ను ఆయ‌న స్పృశిం చారు. దీనిలో ప్ర‌ధానంగా.. రాజ‌కీయాలు.. సినిమా టికెట్లు, మ‌ద్యం, అమ‌రావ‌తి రాజ‌ధాని, ఎంపీలు, అసెంబ్లీలో ఇటీవ‌ల జ‌రిగిన చంద్ర‌బాబు అవ‌మాన‌కర ఘ‌ట‌న ఇలా..అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా త‌న సినిమాల‌పై ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టింద‌ని ప‌వ‌న్ చెప్పారు. అంతేకాదు.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్న‌ త‌న‌ను ఆర్థికంగా దెబ్బ‌తీయాని.. వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంద‌ని తెలిపారు.

అందుకే పార‌ద‌ర్శ‌క‌త పేరుతో.. టికెట్ల‌ను ఆన్‌లైన్ చేశార‌ని.. దీనివ‌ల్ల ఏం సాధిస్తార‌ని.. ప్ర‌శ్నించారు. ఇదే స‌మ‌యంలో మ‌ద్యం విక్ర‌యాల‌కు పార‌ద‌ర్శ‌క‌త ఉందా? అని నిల‌దీశారు. మ‌ద్యాన్ని మీ ఇష్టం వ‌చ్చిన ధ‌ర‌ల‌కు అమ్ముకోవ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. 60 రూపాయ‌లు ఉన్న చీప్ లిక్క‌ర్‌ను రూ.200ల‌కు విక్ర‌యిస్తున్నార‌ని.. దానికి కూడా పేరూ.. ఊరూ ఉండ‌డం లేద‌ని విరుచుకుప‌డ్డారు. ఇలా.. అత్యధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్న మ‌ద్యంలో సీఎం జ‌గ‌న్‌కు వాటాలు వెళ్తున్నాయ‌ని ప‌వ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మద్యం వ్యాపారంలో వచ్చిన డబ్బును లారీల్లో గట్టి బందోబస్తు మధ్య తీసుకెళుతున్నారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. దీనిలో ఒక్క జ‌గ‌న్‌కే రూ.40 వేల కోట్ల న‌గ‌దు ముట్టింద‌న్నారు.

మ‌రి పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం మ‌ద్యం విష‌యంలో ఎందుకు ద్వంద్వ విధానాలు అవ‌లంబి స్తోంద‌ని ప‌వ‌న్ నిల‌దీశారు. త‌న‌తో పెట్టుకుంటే.. మంచిదికాద‌న్న ప‌వ‌న్‌.. ప్ర‌భుత్వ అవినీతిని వెలికితీస్తామ‌ని హెచ్చ‌రించారు. తాను అవ‌స‌ర‌మైతే.. త‌న సినిమాల‌ను ఉచితంగా రిలీజ్ చేయిస్తాన‌ని.. ప్ర‌క‌టించారు. రూ.200 పెట్టి మ‌ద్యం అమ్ముతున్న‌వారు.. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసి నిర్మించే సినిమాల‌ను మాత్రం రూ.5 చూపిస్తారా? అని నిల‌దీశారు. మీకు సినిమాల నుంచి నిర్మాత‌ల నుంచి ముడుపులు రావు కాబ‌ట్టే.. వీటిపై పెత్త‌నం చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. అదేమ‌ద్యంపై ఇష్టానుసారంగా.. వ‌సూళ్లు చేస్తారా? అని ప‌వ‌న్ నిల‌దీశారు.

యూపీ, బిహార్‌ రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అథమంగా ఉంటాయని అంటుంటారని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటిని మించిపోయిందని పవన్ అన్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే రౌడీయిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం స్థాయి వ్యక్తిని, ఆయన సతీమణి గురించి దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. విపక్ష నేత భార్యనే అసెంబ్లీలో దూషిస్తే.. వీధిలో మహిళలకు రక్షణ ఏముంటుందని నిలదీశారు పవన్. చట్టసభల్లో బూతులే శాసనాలు అవుతున్నాయని ఆగ్రహించారు. ఇలాంటి సర్కారును గద్దె దించాలన్న పవన్… 2024లో వచ్చే కొత్త ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు.

This post was last modified on December 12, 2021 11:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

ఎట్టకేలకు పీస్ ప్రైజ్ దక్కించుకున్న ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. నోబెల్ ప్ర‌పంచ శాంతి పుర‌స్కారం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago