Political News

KCR సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ?

అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ కూడా పార్లమెంటు సమావేశాల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు మండిపడుతున్నాయి. వరి రాజకీయంతో దాదాపు వారం రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంటు వేదికగా ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కూడా ఎంపీలు నానా గోల చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు ఎంత ఆందోళన చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎంపీలు రాంగ్ ట్రాక్ లో వెళ్ళారు. కాబట్టే కేంద్రప్రభుత్వమే కాదు చివరకు ప్రతిపక్షాల్లో కూడా చాలా పార్టీలు వీళ్ళకు మద్దతుగా నిలవలేదు.

ఇక్కడ కేసీయార్ చేసిన మరో తప్పు ఏమిటంటే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించటం. కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ కేశవరావు ప్రకటించడమే విచిత్రంగా ఉంది. టీఆర్ఎస్ ఎంపీల్లో నిజాయితీ ఉంటే పార్లమెంటు సమావేశాలు అయ్యేవరకు హౌస్ లో వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తునే ఉండాలి. అలాంటిది బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించటంలో అర్థమేంటి ? కేంద్రం తమను పట్టించుకోలేదని వీళ్ళు అనుకుంటే  సస్పెండ్ చేయించుకునుండాలి.

పార్లమెంటు సమావేశాలు బహిష్కరించడం కన్నా సస్పెండ్ చేయించుకోవటం గౌరవప్రదంగా ఉంటుంది కదా ? తమ ఆందోళనను అణగతొక్కేందుకే తమను పార్లమెంటు నుండి కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని చెప్పుకునే అవకాశం ఉండేది. అలాకాకుండా వీళ్ళంతట వీళ్ళే పార్లమెంటును బహష్కరిస్తున్నట్లు ప్రకటించారంటేనే తెరవెనుక ఏదో ఒప్పందం జరిగిందనే అనుమానాలు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్లే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎంపీల పార్లమెంటు బహిష్కరణ వెనుక పెద్ద కథే నడిచిందని ఆరోపించారు.

ఓ భూ కుంభకోణంలో నుండి మంత్రి కేటీయార్ బయటపడేందుకే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపించారు. ఒక రియల్ ఎస్టేట్ సంస్ధ, ఒక ఇరిగేషన్ కాంట్రాక్టు సంస్ధకు నోటీసులిచ్చిన ఈడీ కేటీయార్ కు కూడా నోటీసులు ఇవ్వాల్సుందని రేవంత్ చెప్పారు. అయితే చివరి నిముషంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే ఎంపీల పార్లమెంటు బహిష్కరణగా రేవంత్ చెప్పారు. అందుకనే రెండు సంస్ధలకు నోటీసులిచ్చిన ఈడీ కేటీయార్ మాత్రం నిలిపేసినట్లు వివరించారు.

రాష్ట్రంలోని బర్నింగ్ ప్రాబ్లం కోసం పార్లమెంటులో చేసిన పోరాటం వల్ల తామంతా సస్పెండ్ అయినట్లు చెప్పుకునే అవకాశాన్ని ఎంపీలు కోల్పోయారు. చూస్తుంటే ఇది కేసీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అనుమానంగా ఉంది. తమ సమస్యల విషయంలో కేంద్రంతో పార్లమెంటు వేదికగా పోరాటాలు చేయకుండా సమావేశాలను ఎందుకు బహిష్కరించారని రైతాంగం కేసీయార్ లేదా ఎంపీలను నిలదీస్తే ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

This post was last modified on December 9, 2021 4:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

28 minutes ago

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

1 hour ago

వారణాసి హీరోయిన్ విదేశీ రహస్యం

ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…

1 hour ago

నాగచైతన్య.. అరాచకమైన మేకోవర్..

నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్‌లో, లవర్ బాయ్‌గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…

2 hours ago

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…

3 hours ago

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

4 hours ago