అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ కూడా పార్లమెంటు సమావేశాల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు మండిపడుతున్నాయి. వరి రాజకీయంతో దాదాపు వారం రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంటు వేదికగా ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కూడా ఎంపీలు నానా గోల చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు ఎంత ఆందోళన చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎంపీలు రాంగ్ ట్రాక్ లో వెళ్ళారు. కాబట్టే కేంద్రప్రభుత్వమే కాదు చివరకు ప్రతిపక్షాల్లో కూడా చాలా పార్టీలు వీళ్ళకు మద్దతుగా నిలవలేదు.
ఇక్కడ కేసీయార్ చేసిన మరో తప్పు ఏమిటంటే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించటం. కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ కేశవరావు ప్రకటించడమే విచిత్రంగా ఉంది. టీఆర్ఎస్ ఎంపీల్లో నిజాయితీ ఉంటే పార్లమెంటు సమావేశాలు అయ్యేవరకు హౌస్ లో వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తునే ఉండాలి. అలాంటిది బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించటంలో అర్థమేంటి ? కేంద్రం తమను పట్టించుకోలేదని వీళ్ళు అనుకుంటే సస్పెండ్ చేయించుకునుండాలి.
పార్లమెంటు సమావేశాలు బహిష్కరించడం కన్నా సస్పెండ్ చేయించుకోవటం గౌరవప్రదంగా ఉంటుంది కదా ? తమ ఆందోళనను అణగతొక్కేందుకే తమను పార్లమెంటు నుండి కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని చెప్పుకునే అవకాశం ఉండేది. అలాకాకుండా వీళ్ళంతట వీళ్ళే పార్లమెంటును బహష్కరిస్తున్నట్లు ప్రకటించారంటేనే తెరవెనుక ఏదో ఒప్పందం జరిగిందనే అనుమానాలు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్లే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎంపీల పార్లమెంటు బహిష్కరణ వెనుక పెద్ద కథే నడిచిందని ఆరోపించారు.
ఓ భూ కుంభకోణంలో నుండి మంత్రి కేటీయార్ బయటపడేందుకే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపించారు. ఒక రియల్ ఎస్టేట్ సంస్ధ, ఒక ఇరిగేషన్ కాంట్రాక్టు సంస్ధకు నోటీసులిచ్చిన ఈడీ కేటీయార్ కు కూడా నోటీసులు ఇవ్వాల్సుందని రేవంత్ చెప్పారు. అయితే చివరి నిముషంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే ఎంపీల పార్లమెంటు బహిష్కరణగా రేవంత్ చెప్పారు. అందుకనే రెండు సంస్ధలకు నోటీసులిచ్చిన ఈడీ కేటీయార్ మాత్రం నిలిపేసినట్లు వివరించారు.
రాష్ట్రంలోని బర్నింగ్ ప్రాబ్లం కోసం పార్లమెంటులో చేసిన పోరాటం వల్ల తామంతా సస్పెండ్ అయినట్లు చెప్పుకునే అవకాశాన్ని ఎంపీలు కోల్పోయారు. చూస్తుంటే ఇది కేసీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అనుమానంగా ఉంది. తమ సమస్యల విషయంలో కేంద్రంతో పార్లమెంటు వేదికగా పోరాటాలు చేయకుండా సమావేశాలను ఎందుకు బహిష్కరించారని రైతాంగం కేసీయార్ లేదా ఎంపీలను నిలదీస్తే ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on December 9, 2021 4:05 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…