ఏపీలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓ పాట మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’ అంటూ వైసీపీ నేతలు ఆ పాటతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక పొలిటికల్ చార్ట్ బస్టర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది. వాస్తవానికి కూడా, జనానికి జగన్ ను చేరువ చేయడంలో ఈ పాట కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
కట్ చేస్తే…తాజాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అదే పాటను టీడీపీ నేతలు తెగ వాడేస్తున్నారు. వైసీపీ అంటే మండిపడే టీడీపీ నేతలు ఈ పాట వాడడమేంటి అనుకోకండి. జగన్ వైఫల్యాలపై, వైసీపీ నేతల తీరుపై సెటైరికల్ గా ఈ పాటను తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. జగన్ ను పొగుడుతూ ఆనాడు వైసీపీ నేతలు వీర లెవల్లో వాడిన ఆ పాటను…ఇపుడు జగన్ ను ట్రోల్ చేసేందుకు టీడీపీ నేతలు వాడుతుండడం విశేషం.
తాజాగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్పై సెటైర్ వేస్తూ టీడీపీ ట్విటర్ ఖాతాలో ఓ సెటైరికల్ సాంగ్ పోస్ట్ అయింది. పార్కులో ఓ బెంచీకి శివకుమార్ పెయింట్ వేయడంపై టీడీపీ నేతలు సెటైర్ వేశారు. అసెంబ్లీలో ఉత్త వెకిలి నవ్వులే కాదు..పార్కుల్లో బెంచీల్లాంటివి కూడా ఏర్పాటు చేయిస్తున్నారంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు, శివకుమార్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్టు చూశాక… సారు తన రేంజ్ కి ఏమాత్రం తగ్గట్లేదనిపిస్తోంది కదూ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, ఈ సెటైరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
This post was last modified on December 6, 2021 1:10 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…