ఏపీలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓ పాట మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’ అంటూ వైసీపీ నేతలు ఆ పాటతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక పొలిటికల్ చార్ట్ బస్టర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది. వాస్తవానికి కూడా, జనానికి జగన్ ను చేరువ చేయడంలో ఈ పాట కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
కట్ చేస్తే…తాజాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అదే పాటను టీడీపీ నేతలు తెగ వాడేస్తున్నారు. వైసీపీ అంటే మండిపడే టీడీపీ నేతలు ఈ పాట వాడడమేంటి అనుకోకండి. జగన్ వైఫల్యాలపై, వైసీపీ నేతల తీరుపై సెటైరికల్ గా ఈ పాటను తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. జగన్ ను పొగుడుతూ ఆనాడు వైసీపీ నేతలు వీర లెవల్లో వాడిన ఆ పాటను…ఇపుడు జగన్ ను ట్రోల్ చేసేందుకు టీడీపీ నేతలు వాడుతుండడం విశేషం.
తాజాగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్పై సెటైర్ వేస్తూ టీడీపీ ట్విటర్ ఖాతాలో ఓ సెటైరికల్ సాంగ్ పోస్ట్ అయింది. పార్కులో ఓ బెంచీకి శివకుమార్ పెయింట్ వేయడంపై టీడీపీ నేతలు సెటైర్ వేశారు. అసెంబ్లీలో ఉత్త వెకిలి నవ్వులే కాదు..పార్కుల్లో బెంచీల్లాంటివి కూడా ఏర్పాటు చేయిస్తున్నారంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు, శివకుమార్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్టు చూశాక… సారు తన రేంజ్ కి ఏమాత్రం తగ్గట్లేదనిపిస్తోంది కదూ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, ఈ సెటైరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
This post was last modified on December 6, 2021 1:10 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…