ఏపీలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓ పాట మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’ అంటూ వైసీపీ నేతలు ఆ పాటతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక పొలిటికల్ చార్ట్ బస్టర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది. వాస్తవానికి కూడా, జనానికి జగన్ ను చేరువ చేయడంలో ఈ పాట కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
కట్ చేస్తే…తాజాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అదే పాటను టీడీపీ నేతలు తెగ వాడేస్తున్నారు. వైసీపీ అంటే మండిపడే టీడీపీ నేతలు ఈ పాట వాడడమేంటి అనుకోకండి. జగన్ వైఫల్యాలపై, వైసీపీ నేతల తీరుపై సెటైరికల్ గా ఈ పాటను తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. జగన్ ను పొగుడుతూ ఆనాడు వైసీపీ నేతలు వీర లెవల్లో వాడిన ఆ పాటను…ఇపుడు జగన్ ను ట్రోల్ చేసేందుకు టీడీపీ నేతలు వాడుతుండడం విశేషం.
తాజాగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్పై సెటైర్ వేస్తూ టీడీపీ ట్విటర్ ఖాతాలో ఓ సెటైరికల్ సాంగ్ పోస్ట్ అయింది. పార్కులో ఓ బెంచీకి శివకుమార్ పెయింట్ వేయడంపై టీడీపీ నేతలు సెటైర్ వేశారు. అసెంబ్లీలో ఉత్త వెకిలి నవ్వులే కాదు..పార్కుల్లో బెంచీల్లాంటివి కూడా ఏర్పాటు చేయిస్తున్నారంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు, శివకుమార్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్టు చూశాక… సారు తన రేంజ్ కి ఏమాత్రం తగ్గట్లేదనిపిస్తోంది కదూ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, ఈ సెటైరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
This post was last modified on December 6, 2021 1:10 pm
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…