Political News

ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట

ఏపీ ఆర్థిక స్థితి నానాటికి దిగజారిపోతోందని, ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని కొంతకాలంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఖజానా ఖాళీ కావడంతో ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం నానా తిప్పలు పడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, లేటైనా సరే జీతాలిస్తున్నాం కదా అంటూ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై కొంతకాలంగా ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

దానికి తోడు చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి వ్యవహారాలలో ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులు అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ ప్రకారం ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచణ నోటీసు ఇచ్చాయి.

ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు సహా విశాఖ, తిరుపతి, ఏలూరు, ఒంగోలు నగరాల్లో డివిజన్ స్థాయి సదస్సులు నిర్వహించనున్నాయి. ప్రభుత్వం పిఆర్సీ నివేదికను బయట పెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని  అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. సీఎం జగన్ జోక్యం చేసుకొని పీఆర్సీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చే జీతాలు తమ హక్కు అని అది భిక్ష కాదని అన్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిది అనుభవరాహిత్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయని, ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయని చెప్పారు తమ న్యాయపరమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, అంతవరకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయనున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్సుల చెల్లింపు తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా ఉద్యమం చేయబోతున్నారని తెలుస్తోంది. మరి, ఈ వ్యవహారంపై ప్రభుత్వ స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on December 1, 2021 2:39 pm

Share
Show comments

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago