ఔను.. వైసీపీ నేతల మధ్య ఎక్కడా జోష్ కనిపించడం లేదు. ఎవరూ కూడా హ్యాపీగా కనిపించడం లేదు. ఎందుకంటు.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి.. రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. గత 2019 ఎన్నికల్లో వచ్చి న.. ఎన్నికల్లో 151 సీట్ల భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. నేటికి(మంగళవారం) రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. అయితే.. ఎప్పుడు ఏం జరిగినా.. కేక్ కటింగులు..చేసుకునే ప్రభుత్వ నేతలు.. అసలు.. ఈ విషయాన్ని పట్టించుకోనట్టే వ్యవహరిస్తుండడం.. కనీసం.. జిల్లా కార్యాలయాల్లోనూ సందడి లేకపోవడం.. చర్చకు దారితీసింది.
వైసీపీ నాయకుల జోరు, హుషారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ను సంతోష పరచడమే లక్ష్యంగా.. ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండున్నరేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో నాయకులు సంబరాలు చేసుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే.. ఎక్కడా ఊసు కనిపించలేదు. సందడి లేకుండానే రెండున్నళ్ల పండగ రోజు.. ముగిసిపోతుందా? అనే చర్చ సాగుతోంది. అయితే.. ఇలా స్తబ్దుగా ఉండడానికి కారణాలు ఏంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఒకవైపు రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఇంకా వర్షం ప్రభావంతో నే అల్లాడుతున్నాయి.
దీంతో ఆ జిల్లాలను అలా వదిలేసి సంబరాలు చేసుకుంటే భావ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అదేస మయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే.. తమ నిధులు వాడేశారంటే.. తమ నిధులు తీసుకున్నారని.. పంచాయతీలు, వర్సీటు.. గగ్గోలు పెడుతు న్నాయి. అదేసమయంలో కాగ్ నివేదికలోనూ.. ప్రబుత్వాన్ని గట్టిగానే హెచ్చరించింది. అసలు చేస్తున్న అప్పులకు.. పొంతన ఉండడం లేదని.. అసెంబ్లీకి కూడా చెప్పకుండానే అప్పులు చేస్తున్నారని.. పేర్కొం ది. దీంతో ప్రభుత్వ వర్గాల్లోనూ దీనిపై చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలో అట్టహాసంగా.. రెండున్నరేళ్ల పండగ చేసుకుంటే.. ఎలా? అనే చర్చ వైసీపీ నేతల మధ్య సాగుతోంది. వీటికితోడు.. అసెంబ్లీలో చంద్రబాబు ఘటన కూడా కొందరు నేతలను ఇంకా కలవర పెడుతోంది. ఇది ఇప్పుడు పబ్లిక్ టాక్ గా మారిపోయింది. టీడీపీ వ్యూహాత్మకంగా.. ప్రజల్లోకి తీసుకువెళ్తోం ది. ఈ క్రమంలో మహిళలంటే.. ప్రభుత్వానికి విలువలేదనే భావన సర్వత్రా వినిపిస్తుండడంతో.. జగన్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ల పాలన సంబరాలకు దూరంగా ఉందనే భావన కలుగుతోంది. దీంతో ఎక్కడా చడి చప్పుడు లేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 30, 2021 11:58 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…