Political News

వైసీపీలో క‌నిపించ‌ని జోష్.. ఏం జ‌రిగింది?

ఔను.. వైసీపీ నేత‌ల మ‌ధ్య ఎక్క‌డా జోష్ క‌నిపించ‌డం లేదు. ఎవ‌రూ కూడా హ్యాపీగా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటు.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి.. రెండున్న‌రేళ్లు పూర్త‌య్యాయి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చి న‌.. ఎన్నిక‌ల్లో 151 సీట్ల భారీ విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. నేటికి(మంగ‌ళ‌వారం) రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకుంది. అయితే.. ఎప్పుడు ఏం జ‌రిగినా.. కేక్ క‌టింగులు..చేసుకునే ప్ర‌భుత్వ నేత‌లు.. అస‌లు.. ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం.. క‌నీసం.. జిల్లా కార్యాల‌యాల్లోనూ సంద‌డి లేక‌పోవ‌డం.. చ‌ర్చ‌కు దారితీసింది.

వైసీపీ నాయ‌కుల జోరు, హుషారు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్‌ను సంతోష ప‌ర‌చ‌డమే ల‌క్ష్యంగా.. ముందుకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో రెండున్న‌రేళ్ల పాల‌న పూర్త‌యిన నేప‌థ్యంలో నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. ఎక్క‌డా ఊసు క‌నిపించ‌లేదు. సంద‌డి లేకుండానే రెండున్న‌ళ్ల పండ‌గ రోజు.. ముగిసిపోతుందా? అనే చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఇలా స్త‌బ్దుగా ఉండ‌డానికి కార‌ణాలు ఏంటి?  అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఒక‌వైపు రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఇంకా వ‌ర్షం ప్ర‌భావంతో నే అల్లాడుతున్నాయి.

దీంతో ఆ జిల్లాల‌ను అలా వ‌దిలేసి సంబ‌రాలు చేసుకుంటే భావ్యం కాద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అదేస మయంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఇప్ప‌టికే.. త‌మ నిధులు వాడేశారంటే.. తమ నిధులు తీసుకున్నార‌ని.. పంచాయ‌తీలు, వ‌ర్సీటు.. గ‌గ్గోలు పెడుతు న్నాయి. అదేస‌మ‌యంలో కాగ్ నివేదిక‌లోనూ.. ప్ర‌బుత్వాన్ని గ‌ట్టిగానే హెచ్చ‌రించింది. అస‌లు చేస్తున్న అప్పుల‌కు.. పొంతన ఉండ‌డం లేద‌ని.. అసెంబ్లీకి కూడా చెప్ప‌కుండానే అప్పులు చేస్తున్నార‌ని.. పేర్కొం ది. దీంతో ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ దీనిపై చ‌ర్చ సాగుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో అట్ట‌హాసంగా.. రెండున్న‌రేళ్ల పండ‌గ చేసుకుంటే.. ఎలా? అనే చ‌ర్చ వైసీపీ నేత‌ల మ‌ధ్య సాగుతోంది. వీటికితోడు.. అసెంబ్లీలో చంద్ర‌బాబు ఘ‌ట‌న కూడా కొంద‌రు నేత‌ల‌ను ఇంకా క‌ల‌వ‌ర పెడుతోంది. ఇది ఇప్పుడు ప‌బ్లిక్ టాక్ గా మారిపోయింది. టీడీపీ వ్యూహాత్మ‌కంగా.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తోం ది. ఈ క్ర‌మంలో మ‌హిళ‌లంటే.. ప్ర‌భుత్వానికి విలువ‌లేద‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డంతో.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ రెండున్న‌రేళ్ల పాల‌న సంబ‌రాల‌కు దూరంగా ఉంద‌నే భావ‌న క‌లుగుతోంది. దీంతో ఎక్క‌డా చ‌డి చ‌ప్పుడు లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 30, 2021 11:58 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

1 hour ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

2 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

3 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

3 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

3 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

3 hours ago