Political News

వైసీపీలో క‌నిపించ‌ని జోష్.. ఏం జ‌రిగింది?

ఔను.. వైసీపీ నేత‌ల మ‌ధ్య ఎక్క‌డా జోష్ క‌నిపించ‌డం లేదు. ఎవ‌రూ కూడా హ్యాపీగా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటు.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి.. రెండున్న‌రేళ్లు పూర్త‌య్యాయి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చి న‌.. ఎన్నిక‌ల్లో 151 సీట్ల భారీ విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. నేటికి(మంగ‌ళ‌వారం) రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకుంది. అయితే.. ఎప్పుడు ఏం జ‌రిగినా.. కేక్ క‌టింగులు..చేసుకునే ప్ర‌భుత్వ నేత‌లు.. అస‌లు.. ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం.. క‌నీసం.. జిల్లా కార్యాల‌యాల్లోనూ సంద‌డి లేక‌పోవ‌డం.. చ‌ర్చ‌కు దారితీసింది.

వైసీపీ నాయ‌కుల జోరు, హుషారు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్‌ను సంతోష ప‌ర‌చ‌డమే ల‌క్ష్యంగా.. ముందుకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో రెండున్న‌రేళ్ల పాల‌న పూర్త‌యిన నేప‌థ్యంలో నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. ఎక్క‌డా ఊసు క‌నిపించ‌లేదు. సంద‌డి లేకుండానే రెండున్న‌ళ్ల పండ‌గ రోజు.. ముగిసిపోతుందా? అనే చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఇలా స్త‌బ్దుగా ఉండ‌డానికి కార‌ణాలు ఏంటి?  అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఒక‌వైపు రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఇంకా వ‌ర్షం ప్ర‌భావంతో నే అల్లాడుతున్నాయి.

దీంతో ఆ జిల్లాల‌ను అలా వ‌దిలేసి సంబ‌రాలు చేసుకుంటే భావ్యం కాద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అదేస మయంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఇప్ప‌టికే.. త‌మ నిధులు వాడేశారంటే.. తమ నిధులు తీసుకున్నార‌ని.. పంచాయ‌తీలు, వ‌ర్సీటు.. గ‌గ్గోలు పెడుతు న్నాయి. అదేస‌మ‌యంలో కాగ్ నివేదిక‌లోనూ.. ప్ర‌బుత్వాన్ని గ‌ట్టిగానే హెచ్చ‌రించింది. అస‌లు చేస్తున్న అప్పుల‌కు.. పొంతన ఉండ‌డం లేద‌ని.. అసెంబ్లీకి కూడా చెప్ప‌కుండానే అప్పులు చేస్తున్నార‌ని.. పేర్కొం ది. దీంతో ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ దీనిపై చ‌ర్చ సాగుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో అట్ట‌హాసంగా.. రెండున్న‌రేళ్ల పండ‌గ చేసుకుంటే.. ఎలా? అనే చ‌ర్చ వైసీపీ నేత‌ల మ‌ధ్య సాగుతోంది. వీటికితోడు.. అసెంబ్లీలో చంద్ర‌బాబు ఘ‌ట‌న కూడా కొంద‌రు నేత‌ల‌ను ఇంకా క‌ల‌వ‌ర పెడుతోంది. ఇది ఇప్పుడు ప‌బ్లిక్ టాక్ గా మారిపోయింది. టీడీపీ వ్యూహాత్మ‌కంగా.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తోం ది. ఈ క్ర‌మంలో మ‌హిళ‌లంటే.. ప్ర‌భుత్వానికి విలువ‌లేద‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డంతో.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ రెండున్న‌రేళ్ల పాల‌న సంబ‌రాల‌కు దూరంగా ఉంద‌నే భావ‌న క‌లుగుతోంది. దీంతో ఎక్క‌డా చ‌డి చ‌ప్పుడు లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

24 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

2 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

7 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

11 hours ago