కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల అనుచిత వ్యాఖ్యల వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి వ్యక్తిత్వ హననానికి వైసీపీ నేతలు పాల్పడ్డారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. అయితే, తాము భువనేశ్వరిని ఏమీ అనలేదని అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాము చంద్రబాబును అంటామని, భువనేశ్వరిని అనాల్సిన పనిలేదని మీడియా ముందు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇక, ఆ గందరగోళానికి కారణమైన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డులనుంచి కూడా తొలగించారు. కానీ, ఆ వ్యాఖ్యలను కొందరు టీడీపీ సభ్యులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైసీపీ నేతల గుట్టురట్టయింది. దీంతో, ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్లు చేశారు. పరోక్షంగా వైసీపీ సభ్యులు ఆ వ్యాఖ్యలు చేశారని స్వయంగా బొత్స అంగీకరించడం సంచలనంగా మారింది.
అసెంబ్లీలో జరిగిన ఘటనను సమర్థించడం లేదన్న బొత్స…తాము చెప్పిందే వినాలన్న పద్ధతిని ప్రతిపక్షాలు వీడాలని హితవుపలికారు. ఇప్పటివరకు తానెప్పుడూ గట్టిగా మాట్లాడలేదని, అందరినీ ఒకే గాటన కట్టడం సరికాదని అన్నారు. ఆ రోజు శాసనసభలో తాను కూడా ఉన్నానని, పక్కనుంచి ఎవరో వచ్చి కామెంట్ చేస్తే అది కౌంట్ అవుతుందా? అని ప్రశ్నించారు. అయితే, దానికి తాను వత్తాసు పలకడం లేదన్న బొత్స…. పక్కనున్న వారు కామెంట్ చేస్తే తానుగానీ, స్పీకర్ గానీ ఎలా బాధ్యులమవుతామని ప్రశ్నించారు.
అసెంబ్లీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని బొత్స హితవు పలికారు. గతంలో తమ పార్టీ నేతలను చంద్రబాబు కించపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయని బొత్స అన్నారు. చంద్రబాబు ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు నిర్వహిస్తున్నారని, తమకంటే ఆడవాళ్లను గౌరవంగా చూసేవాళ్లు ఎవరున్నారు? అని ప్రశ్నించారు. మహిళలకు జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, అటువంటి నాయకుడు మరొకరు లేరని అన్నారు. తాము ప్రజల తీర్పునకు ఎల్లపుడూ సిద్ధమని చెప్పారు.
This post was last modified on November 28, 2021 4:28 pm
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…