టాలీవుడ్లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు కరువవుతున్నారు. కాజల్, నయనతార, శ్రియ లాంటి వారయితేనే సీనియర్ స్టార్స్కి సరైన జోడీలుగా కనిపిస్తున్నారు. దాంతో పదే పదే వారినే రిపీట్ చేయడం జరుగుతోంది. వారు సెట్ కాకపోతే తగిన హీరోయిన్ని వేటాడ్డం కాస్త కష్టమే అవుతోంది. ‘అఖండ’లో హీరోయిన్ కోసం వెతికి వెతికి అలసిపోయి చివరికి ఫామ్లో లేని ప్రగ్యను ఫిక్స్ చేశాడు బోయపాటి. తన సినిమా నుంచి కాజల్ తప్పుకోవడంతో నాగార్జునకి కూడా సేమ్ ప్రాబ్లెమ్ ఎదురయ్యింది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు నాగార్జున. షూటింగ్ కూడా కొంత ముగిసింది. అంతలో ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ సడెన్గా తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం సెర్చ్ స్టార్టయ్యింది. అమలాపాల్ని ఫిక్స్ చేశారనే వార్తలు వచ్చాయి. కానీ రెమ్యునరేషన్ ఇష్యూస్తో ఆమె కూడా సైడైపోయిందని తెలిసింది. దాంతో మళ్లీ మరో హీరోయిన్ని వెతికే పనిలో పడింది టీమ్. ఆ క్రమంలో మెహ్రీన్ పేరు తెరమీదికొచ్చింది. ఆమెనే కన్ఫర్మ్ చేసినట్లు ఇప్పుడు తెలుస్తోంది.
నిజానికి మెహ్రీన్ కూడా మొదట ఎక్కువే డిమాండ్ చేసిందనే గుసగుసలు వినిపించాయి. అయినా చివరికి ఆమెనే ఓకే చేశారని, ప్రస్తుతం ‘ఎఫ్3’ షూట్లో పాల్గొంటున్న ఆమె, త్వరలో ఈ షూట్లోనూ జాయినవుతుందనేది లేటెస్ట్ టాక్. అదే కనుక నిజమైతే మెహ్రీన్ పంట పండినట్టే. ఎందుకంటే ఇంతవరకు అందరూ యంగ్ హీరోలతోనే నటించిందామె. మొట్టమొదటిసారి స్టార్ హీరోతో జోడీ కడుతోంది. పైగా కొన్ని రోజులుగా చెప్పుకోదగ్గ విజయాలు కూడా లేవు తనకి. ప్రవీణ్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి మెహ్రీన్ ఖాతాలో మంచి హిట్ పడే చాన్స్ లేకపోలేదు.
This post was last modified on November 28, 2021 2:42 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…