టాలీవుడ్లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు కరువవుతున్నారు. కాజల్, నయనతార, శ్రియ లాంటి వారయితేనే సీనియర్ స్టార్స్కి సరైన జోడీలుగా కనిపిస్తున్నారు. దాంతో పదే పదే వారినే రిపీట్ చేయడం జరుగుతోంది. వారు సెట్ కాకపోతే తగిన హీరోయిన్ని వేటాడ్డం కాస్త కష్టమే అవుతోంది. ‘అఖండ’లో హీరోయిన్ కోసం వెతికి వెతికి అలసిపోయి చివరికి ఫామ్లో లేని ప్రగ్యను ఫిక్స్ చేశాడు బోయపాటి. తన సినిమా నుంచి కాజల్ తప్పుకోవడంతో నాగార్జునకి కూడా సేమ్ ప్రాబ్లెమ్ ఎదురయ్యింది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు నాగార్జున. షూటింగ్ కూడా కొంత ముగిసింది. అంతలో ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ సడెన్గా తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం సెర్చ్ స్టార్టయ్యింది. అమలాపాల్ని ఫిక్స్ చేశారనే వార్తలు వచ్చాయి. కానీ రెమ్యునరేషన్ ఇష్యూస్తో ఆమె కూడా సైడైపోయిందని తెలిసింది. దాంతో మళ్లీ మరో హీరోయిన్ని వెతికే పనిలో పడింది టీమ్. ఆ క్రమంలో మెహ్రీన్ పేరు తెరమీదికొచ్చింది. ఆమెనే కన్ఫర్మ్ చేసినట్లు ఇప్పుడు తెలుస్తోంది.
నిజానికి మెహ్రీన్ కూడా మొదట ఎక్కువే డిమాండ్ చేసిందనే గుసగుసలు వినిపించాయి. అయినా చివరికి ఆమెనే ఓకే చేశారని, ప్రస్తుతం ‘ఎఫ్3’ షూట్లో పాల్గొంటున్న ఆమె, త్వరలో ఈ షూట్లోనూ జాయినవుతుందనేది లేటెస్ట్ టాక్. అదే కనుక నిజమైతే మెహ్రీన్ పంట పండినట్టే. ఎందుకంటే ఇంతవరకు అందరూ యంగ్ హీరోలతోనే నటించిందామె. మొట్టమొదటిసారి స్టార్ హీరోతో జోడీ కడుతోంది. పైగా కొన్ని రోజులుగా చెప్పుకోదగ్గ విజయాలు కూడా లేవు తనకి. ప్రవీణ్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి మెహ్రీన్ ఖాతాలో మంచి హిట్ పడే చాన్స్ లేకపోలేదు.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…