ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. సభలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు విమర్శించడంపై పెనుదుమారం రేగడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, సభలోకి సభ్యులెవరూ ఫోన్లు తీసుకురావద్దని తమ్మినేని సంచలన ఆదేశాలు జారీ చేశారు.
తనపై వైసీపీ సభ్యులు విమర్శలు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు సభలో మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని మైక్ కట్ చేయడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు తీవ్ర ఆవేదనతో సభకు నమస్కారం పెట్టి వాకౌట్ చేయడం పలువురిని కలచివేసింది. దీంతో, ఆ ఘటనను కొందరు టీడీపీ సభ్యులు ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి సభ్యులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు. ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని తమ్మినేని ఆదేశించారు. రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో రావడంతో తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇతర పార్టీ సభ్యుల విమర్శలను కొందరు సభ్యులు రికార్డు చేసిన నేపథ్యంలోనే తమ్మినేని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on November 26, 2021 7:37 pm
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…