ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. సభలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు విమర్శించడంపై పెనుదుమారం రేగడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, సభలోకి సభ్యులెవరూ ఫోన్లు తీసుకురావద్దని తమ్మినేని సంచలన ఆదేశాలు జారీ చేశారు.
తనపై వైసీపీ సభ్యులు విమర్శలు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు సభలో మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని మైక్ కట్ చేయడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు తీవ్ర ఆవేదనతో సభకు నమస్కారం పెట్టి వాకౌట్ చేయడం పలువురిని కలచివేసింది. దీంతో, ఆ ఘటనను కొందరు టీడీపీ సభ్యులు ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి సభ్యులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు. ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని తమ్మినేని ఆదేశించారు. రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో రావడంతో తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇతర పార్టీ సభ్యుల విమర్శలను కొందరు సభ్యులు రికార్డు చేసిన నేపథ్యంలోనే తమ్మినేని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on November 26, 2021 7:37 pm
బాలీవుడ్ ప్రముఖుల కామెంట్లు ఒక్కోసారి భలే విచిత్రంగా ఉంటాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి మాజీ హీరోయిన్…
మామూలుగా ఒక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజైతే కొంచెం బజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘రాబిన్…
అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్…
చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల వ్యవహార తీరుకు సంబంధించి చట్టాల్లోని నియమ నిబంధనలు పెద్దగా పనిచేయడం లేదు. చట్టాలను పక్కనపెట్టేస్తున్న కొందరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం…
బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ అనేది ఎంత పాపులరయ్యిందో చూస్తున్నాం. కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లు దానికి మరింత…