ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. సభలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు విమర్శించడంపై పెనుదుమారం రేగడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, సభలోకి సభ్యులెవరూ ఫోన్లు తీసుకురావద్దని తమ్మినేని సంచలన ఆదేశాలు జారీ చేశారు.
తనపై వైసీపీ సభ్యులు విమర్శలు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు సభలో మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని మైక్ కట్ చేయడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు తీవ్ర ఆవేదనతో సభకు నమస్కారం పెట్టి వాకౌట్ చేయడం పలువురిని కలచివేసింది. దీంతో, ఆ ఘటనను కొందరు టీడీపీ సభ్యులు ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి సభ్యులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు. ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని తమ్మినేని ఆదేశించారు. రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో రావడంతో తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇతర పార్టీ సభ్యుల విమర్శలను కొందరు సభ్యులు రికార్డు చేసిన నేపథ్యంలోనే తమ్మినేని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on November 26, 2021 7:37 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…