Political News

అసెంబ్లీలో ఫోన్ల వాడకంపై తమ్మినేని సంచలన నిర్ణయం

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. సభలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు విమర్శించడంపై పెనుదుమారం రేగడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, సభలోకి సభ్యులెవరూ ఫోన్లు తీసుకురావద్దని తమ్మినేని సంచలన ఆదేశాలు జారీ చేశారు.

తనపై వైసీపీ సభ్యులు విమర్శలు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు సభలో మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని మైక్ కట్ చేయడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు తీవ్ర ఆవేదనతో సభకు నమస్కారం పెట్టి వాకౌట్ చేయడం పలువురిని కలచివేసింది. దీంతో, ఆ ఘటనను కొందరు టీడీపీ సభ్యులు ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి సభ్యులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు. ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని తమ్మినేని ఆదేశించారు. రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో రావడంతో తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇతర పార్టీ సభ్యుల విమర్శలను కొందరు సభ్యులు రికార్డు చేసిన నేపథ్యంలోనే తమ్మినేని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

This post was last modified on November 26, 2021 7:37 pm

Share
Show comments

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

37 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago