ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిం దే. ఈ మేరకు ఈ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసింది. దీనికి అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. అయి తే దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు దీన్ని వ్యతిరేకిస్తుండగా.. ఇంకొందరు మాత్రం స్వాగతించారు. అయితే, రాజకీయంగా మాత్రం ఇప్పటి వరకు ఎవరూ రియాక్ట్ కాలే దు. జనసేన అధినేత పవన్ మాత్రం.. రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్లో కొన్ని కామెంట్లు చేశారు. తర్వాత.. వైసీపీకి, జనసేన నేతలకు మధ్య కామెంట్లు వచ్చాయి.
ఇక, ఆ తర్వాత.. ఎవరూ ఈ వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యంగా టీడీపీ నేతలు ఎవరూ కూడా రియాక్ట్ కాలేదు. ఇప్పుడు తాజాగా తొలిసారి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇవాళ కడప జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరిక సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఏపీ సర్కారు సినిమా టికెట్లను ఆన్లైన్ చేయడంపై స్పందించారు. ఈ క్రమంలో ఏపీ సర్కారుపైనా.. సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సీఎం వైఎస్ జగన్ ఒక మేధావి. నేడు సినిమా టిక్కెట్లు ఆన్లైన్లో పెట్టి అప్పు తెచ్చుకుంటాడు. అంతేకాదు.. ప్రభుత్వ ఆస్తులు అమ్మతున్నాడు.. లేదా.. తాకట్టు పెడుతున్నాడు. సీఎంకు అనుభవం లేదు.. అహంభావము మాత్రం చాలానే ఉంది. జగన్ రెడ్డి అన్ని గాలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి లాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారు. ఇకపై తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తాం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on November 26, 2021 4:48 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…