మూడు రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చైర్మన్ ఎన్నిక వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు అందజేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించిన అధికారులు.. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. హైకోర్టు అనుమతి మేరకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ ఎక్స్అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. చెన్నుబోయిన చిట్టిబాబును తెలుగు దేశం పార్టీ.. చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు.
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఈ రోజు నిర్వహించడంతోపాటు.. ఎన్నికైన అభ్యర్థులతో పాటు… పిటిషనర్లకు వ్యక్తిగత పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్దం 750 మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది.
వైసీపీ నేతల వీరంగంతో రెండుసార్లు వాయిదా పడిన కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నెల 22 న నిర్వహించాల్సిన ఎన్నికను రిటర్నింగ్ అధికారి రెండుసార్లు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ కౌన్సిలర్లు, ఓ స్వతంత్ర అభ్యర్థి, ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కోరం ఉన్నప్పుడు ఎన్నికను వాయిదా వేయడానికి వీల్లేదని.. వైసీపీ కౌన్సిలర్లు అవరోధం కల్పిస్తున్నారనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేశారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ఆర్వో శివనారాయణరెడ్డి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారంనాటి విచారణకు అత్యవసరంగా పిలిపించిన ధర్మాసనం ఆర్వోకు పలు ప్రశ్నలు సంధించింది. అడ్డుకుంటున్నారని ఎన్నిసార్లు ఎన్నికను వాయిదా వేస్తారని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇంకోదానికి అనుమతించబోమని అంటే దానికీ అంగీకరిస్తారా.. అని ఆర్వో పై మండిపడింది.
కాగా, ఎన్నిక ప్రక్రియను వీడియో తీయించిన అధికారులు దీంతోపాటు ఎన్నిక వివరాలను హైకోర్టుకు అందజేయనున్నారు. చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసినట్టు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పాటిస్తామన్నారు.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…