Political News

హోదాపై కేంద్రానికి నోటీసులు

విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను విచారణ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విభజన చట్టానికి, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎందుకు కట్టుబడి ఉండలేదో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలు చేయాలి. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హామీని నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా మోడీ సర్కార్ నూరుశాతం అమలు చేసిన ఘటన ఒక్కటి కూడా లేదు. ఏపీ మీద పగ పట్టినట్లుగా మోడీ ప్రభుత్వం ఎందుకని ఇలా వ్యవహరిస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. యూపీఏ హామీని గుర్తుచేసే ఏవేవో కతలు చెప్పి మోడీ ప్రభుత్వం తప్పించుకుంటోంది.

ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కు బదులు రైల్వే డివిజన్ అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను నిలిపేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టేశారు. ఇలా ఏ రూపంలో చూసినా హామీలన్నింటినీ గాలికొదిలేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని కూడా బీజేపీ ఏపీకి ద్రోహంచేసింది.

తాజా పరిస్థితి ప్రకారం చివరకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాజకీయం అన్నట్లు మారిపోయింది. సజావుగా అమలు చేయాల్సిన హామీలను కూడా రాజకీయం అజెండాగా మార్చాల్సిన ఘనత మోడికే దక్కుతుంది. మోడీ సర్కార్ నిర్వాకంపై సుప్రింకోర్టులో కేసులు దాఖలైనా ఇపుడా కేసుల విచారణ ఏ దశలో ఉందో తెలీదు. అందుకనే హైకోర్టు ప్రత్యేక హోదా అమలు కోసం దాఖలైన కేసును విచారణకు స్వీకరించింది.

మరి తాజాగా హైకోర్టు ఆదేశాలకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే ఏపీ ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎప్పుడో స్పష్టమైపోయింది. దీనికి ప్రధాన కారణం ఏపీలో బీజేపీకి అసలు ఠికానా లేకపోవటం, ఏపీకి ఎంతచేసినా పార్టీపరంగా ఉపయోగం ఉండదనే అనుమానం కారణమై ఉండవచ్చు. ఏదేమైనా విభజన చట్టం అమలు కోసం న్యాయస్ధానం మెట్లు ఎక్కటం దురదృష్టకరమనే చెప్పాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇస్తున్నపుడు ఏపీకి మాత్రం ఎందుకివ్వటంలేదన్న హైకోర్టు ప్రశ్నకు కేంద్రం ఏమని సమాధానం ఇస్తుందో చూడాల్సిందే.

This post was last modified on November 20, 2021 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యారడైజ్ లోపల ఇంత ప్లానింగా?

కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…

1 hour ago

అడుసు తొక్కనేల కాలు కడగనేల

స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…

2 hours ago

విజయ్ పార్టీ తరుపున త్రిష పోటీ?

తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…

3 hours ago

‘స్టార్లను’ మార్చేసిన బన్నీ

కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…

7 hours ago

ఏపీ బీజేపీలో ‘సొంత’ నిర్ణయాల చర్చ?

రాష్ట్ర బీజేపీలో నాయ‌కుల నియామ‌కం.. కొత్త‌గా వ‌చ్చే వారికి అవ‌కాశం ఇవ్వ‌డం... ఉన్న వారికి ప‌నులు కేటాయించ‌డం.. అనేది స‌హ‌జం.…

9 hours ago

మోడీ సర్కార్ ‘బొగ్గు’ సలహాలు

ప్ర‌స్తుతం నెల‌కొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెబుతున్న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. తాజాగా…

12 hours ago