Political News

హోదాపై కేంద్రానికి నోటీసులు

విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను విచారణ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విభజన చట్టానికి, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎందుకు కట్టుబడి ఉండలేదో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలు చేయాలి. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హామీని నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా మోడీ సర్కార్ నూరుశాతం అమలు చేసిన ఘటన ఒక్కటి కూడా లేదు. ఏపీ మీద పగ పట్టినట్లుగా మోడీ ప్రభుత్వం ఎందుకని ఇలా వ్యవహరిస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. యూపీఏ హామీని గుర్తుచేసే ఏవేవో కతలు చెప్పి మోడీ ప్రభుత్వం తప్పించుకుంటోంది.

ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కు బదులు రైల్వే డివిజన్ అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను నిలిపేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టేశారు. ఇలా ఏ రూపంలో చూసినా హామీలన్నింటినీ గాలికొదిలేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని కూడా బీజేపీ ఏపీకి ద్రోహంచేసింది.

తాజా పరిస్థితి ప్రకారం చివరకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాజకీయం అన్నట్లు మారిపోయింది. సజావుగా అమలు చేయాల్సిన హామీలను కూడా రాజకీయం అజెండాగా మార్చాల్సిన ఘనత మోడికే దక్కుతుంది. మోడీ సర్కార్ నిర్వాకంపై సుప్రింకోర్టులో కేసులు దాఖలైనా ఇపుడా కేసుల విచారణ ఏ దశలో ఉందో తెలీదు. అందుకనే హైకోర్టు ప్రత్యేక హోదా అమలు కోసం దాఖలైన కేసును విచారణకు స్వీకరించింది.

మరి తాజాగా హైకోర్టు ఆదేశాలకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే ఏపీ ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎప్పుడో స్పష్టమైపోయింది. దీనికి ప్రధాన కారణం ఏపీలో బీజేపీకి అసలు ఠికానా లేకపోవటం, ఏపీకి ఎంతచేసినా పార్టీపరంగా ఉపయోగం ఉండదనే అనుమానం కారణమై ఉండవచ్చు. ఏదేమైనా విభజన చట్టం అమలు కోసం న్యాయస్ధానం మెట్లు ఎక్కటం దురదృష్టకరమనే చెప్పాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇస్తున్నపుడు ఏపీకి మాత్రం ఎందుకివ్వటంలేదన్న హైకోర్టు ప్రశ్నకు కేంద్రం ఏమని సమాధానం ఇస్తుందో చూడాల్సిందే.

Satya

Recent Posts

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

3 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

4 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

6 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

6 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

7 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

7 hours ago