Political News

హోదాపై కేంద్రానికి నోటీసులు

విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను విచారణ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విభజన చట్టానికి, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎందుకు కట్టుబడి ఉండలేదో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలు చేయాలి. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హామీని నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా మోడీ సర్కార్ నూరుశాతం అమలు చేసిన ఘటన ఒక్కటి కూడా లేదు. ఏపీ మీద పగ పట్టినట్లుగా మోడీ ప్రభుత్వం ఎందుకని ఇలా వ్యవహరిస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. యూపీఏ హామీని గుర్తుచేసే ఏవేవో కతలు చెప్పి మోడీ ప్రభుత్వం తప్పించుకుంటోంది.

ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కు బదులు రైల్వే డివిజన్ అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను నిలిపేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టేశారు. ఇలా ఏ రూపంలో చూసినా హామీలన్నింటినీ గాలికొదిలేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని కూడా బీజేపీ ఏపీకి ద్రోహంచేసింది.

తాజా పరిస్థితి ప్రకారం చివరకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాజకీయం అన్నట్లు మారిపోయింది. సజావుగా అమలు చేయాల్సిన హామీలను కూడా రాజకీయం అజెండాగా మార్చాల్సిన ఘనత మోడికే దక్కుతుంది. మోడీ సర్కార్ నిర్వాకంపై సుప్రింకోర్టులో కేసులు దాఖలైనా ఇపుడా కేసుల విచారణ ఏ దశలో ఉందో తెలీదు. అందుకనే హైకోర్టు ప్రత్యేక హోదా అమలు కోసం దాఖలైన కేసును విచారణకు స్వీకరించింది.

మరి తాజాగా హైకోర్టు ఆదేశాలకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే ఏపీ ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎప్పుడో స్పష్టమైపోయింది. దీనికి ప్రధాన కారణం ఏపీలో బీజేపీకి అసలు ఠికానా లేకపోవటం, ఏపీకి ఎంతచేసినా పార్టీపరంగా ఉపయోగం ఉండదనే అనుమానం కారణమై ఉండవచ్చు. ఏదేమైనా విభజన చట్టం అమలు కోసం న్యాయస్ధానం మెట్లు ఎక్కటం దురదృష్టకరమనే చెప్పాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇస్తున్నపుడు ఏపీకి మాత్రం ఎందుకివ్వటంలేదన్న హైకోర్టు ప్రశ్నకు కేంద్రం ఏమని సమాధానం ఇస్తుందో చూడాల్సిందే.

This post was last modified on November 20, 2021 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

6 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

6 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

8 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

8 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

10 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

11 hours ago