Political News

వైసీపీ గెలిస్తే టీడీపీ ఆఫీసుకు తాళాలు-అచ్చెన్న

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని.. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అప్పుల భారం అసాధారణం పెరిగిపోవడం.. గత ఏడాది వ్యవధిలో విపరీతంగా జనాలపై ధరల భారం మోపడం.. రోడ్లు సహా మౌళిక వసతులు దారుణంగా మారడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. సోషల్ మీడియాలో ఎన్నెన్నో అనుకుంటున్నారు కానీ.. ఏవైనా ఎన్నికలు జరిగితే మాత్రం ప్రభుత్వంపై జనాగ్రహం ఎంతమాత్రం కనిపించడం లేదు.

ఉచిత పథకాలు జనాల మీదా బాగానే ప్రభావం చూపుతున్నాయా.. లేక ప్రభుత్వం డబ్బు, అధికార బలం చూపిస్తోందా.. ప్రతిపక్షం మీద జనాలకు నమ్మకం కలగట్లేదా.. ఇలా కారణాలు ఏవైనా సరే.. ప్రతి ఎన్నికలోనూ వైసీపీ హవా కనిపిస్తోంది. తాజాగా మున్సిపల్, పంచాయితీ ఎన్నికల రెండో దశలోనూ వైసీపీ ప్రభంజనమే కనిపించింది.

తమకు కంచు కోట అయిన కుప్పం సహా చాలా చోట్ల ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చుక్కెదురైంది. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అయినా టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే ఈ విషయంలో తమకు ఎలాంటి సందేహాలు లేవని.. రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా తమదే విజయం అని అంటున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. స్థానిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాకు వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర సవాలు విసిరారు.

వైసీపీ ప్రభుత్వం మీద జనాల్లో తీవ్ర ఆగ్రహం ఉందని.. డబ్బు ఖర్చు పెట్టి, అధికార దుర్వినియోగం చేసి వైసీపీ స్థానిక ఎన్నికల్లో గెలిచిందని.. వైసీపీకి దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని.. ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిస్తే టీడీపీ ఆఫీసుకి తాళాలు వేస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తాను ప్రకటిస్తున్నానని ఆయనన్నారు.

టీడీపీ కార్యకర్తలు ఇంతకుముందు వైసీపీకి చాలా భయపడేవారని.. బయటికి రాలేకపోయారని.. తమ మద్దతుదారులను పోలింగ్ బూత్‌లకు తీసుకొచ్చి ఓట్లు కూడా వేయించలేకపోయిన మాట వాస్తవమని.. కానీ తాజా ఎన్నికల్లో దేనికీ భయపడకుండా ముందుకొచ్చి గొప్పగా పోరాడారని.. కేసులు పెడితే పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి అంటూ ప్రాణాలకు తెగించి పోరాడారని.. వాళ్లకు తాను పాదాభివందనం చేస్తానని అచ్చెన్నాయుడు అన్నారు.

This post was last modified on November 18, 2021 1:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

9 hours ago