ఏపీ సీఎం జగన్.. ఒక విషయంపై ఇమ్మిడియెట్గా రియాక్ట్ అయ్యారు. తాను ప్రయాణిస్తున్న మార్గంలో దుర్వాసన రావడం.. గమనించిన ఆయన.. దీనిపై అధికారులను నిలదీశారు. వెన్వెంటనే వారిని రంగంలోకి దింపి.. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీసి.. సమస్య పరిష్కారానికి కృషి చేశారు. విషయం ఏంటంటే..
జాతీయ రహదారి వెంట తీవ్రమైన దుర్వాసన వెదజల్లడంపై.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని గన్నవరం విమానాశ్రయం నుంచి వస్తుండగా.. విజయవాడలోని ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన వచ్చింది. దీంతో ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయమై వెంటనే సీఎం తన కార్యాలయం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో నుంచి సచివాలయం అధికారులకు.. అక్కడి నుంచి కృష్ణా జిల్లా కలెక్టరుకు ఆదేశాలు చేరాయి.
ఇంకేముంది.. హుటాహుటిన రంగంలోకి దిగి.. అసలు సమస్యను గుర్తించారు. ఆటోనగర్ నుంచి వచ్చే మురుగు ప్రసాదంపాడు, ఎనికేపాడులో నిల్వ ఉంటోందని గమనించిన అధికారులు.. పక్కా డ్రైనేజీ నిర్మించాలని ప్రతిపాదించారు. జాతీయ రహదారి వైపు ఆ దుర్వాసన రాకుండా ఆటోనగర్ నుంచి నిడమానూరు మీదుగా మురుగునీటిని మళ్లించాలని తెలిపారు. ఆటోనగర్ వద్ద పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీటిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అదేవిధంగా జాతీయరహదారి వెంట వీధిదీపాలు వెలగకపోవడంపైనా సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గవర్నర్, కేంద్ర మంత్రులు విమానాశ్రయం నుంచి నగరం మీదుగా సచివాలయం, ఇతర ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉన్నందున.. వీధి దీపాలు, మురుగు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. దీంతో ఇతర పనులు మానేసి మరీ.. అధికారులు.. ఇక్కడ పనులు ప్రారంభించారు.
This post was last modified on November 16, 2021 2:07 pm
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…