Political News

దొంగ ఓట‌ర్లు, పోలీసు లాఠీ చార్జీలు..చంద్ర‌బాబు ఫైర్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోని కుప్పం మునిసిపాలిటీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే.. అడుగ‌డుగునా వివాదాలు.. దొంగ ఓట‌ర్లు, పోలీసు లాఠీ చార్జీలు.. ఇలా.. తీవ్ర వివాదానికి కేంద్రంగా ఈ ఎన్నిక‌లు మారిపోయాయి. దీంతో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిందెన్నడూ లేదని చంద్రబాబు అన్నారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ విరుచుకుప‌డ్డారు.

“వైసీపీ నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇలాగైతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు. దొంగ ఓట్లు వేయబోతున్నారని ముందే చెప్పాం. మున్సిపల్‌ ఎన్నికలను కూడా అపహాస్యం చేసిన ఘటనలా? ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా? గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారు.” అని ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీలు, మేయర్లు, పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఎందుకెళ్లార‌ని చంద్ర‌బాబు నిల‌దీశారు. అనధికార వాహనాలను ఎందుకు సీజ్‌ చేయలేదని పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. ఎంతమందిని అరెస్టు చేశారో సమాధానం చెప్పాలన్నారు. దొంగ ఓటర్లపై పోరాడేవారిపై పోలీసుల లాఠీఛార్జ్‌ దుర్మార్గమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. కుప్పంలో దొంగ ఓటర్లను టీడీపీ నేతలు పట్టుకున్నా, ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేద న్నారు. ఫిర్యాదును పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్టు చేశారని, దొంగ ఓటర్లను వారి కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారని అన్నారు. పోలింగ్‌ ఏజెంట్లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారని బాబు మండి పడ్డారు.

ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే శిక్ష తప్పదని పోలీసుల‌ను చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల‌ని, అడుగడుగునా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఘటనపైనా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామ‌ని.. అయినా.. ప‌ట్టించుకోలేద‌ని.. విమ‌ర్శించారు. ఎన్నికల నిర్వహణ చేతకాకుంటే ఎస్ఈసీ నీలం సాహ్ని రిజైన్ చేసి వెళ్లిపోవాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వమే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టుగా ఉంద‌ని.. చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు.

Satya

Recent Posts

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

26 minutes ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

33 minutes ago

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…

48 minutes ago

ఈసారి స్వయంగా రంగంలోకి దిగుతున్న PK

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ PK .. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్ష…

1 hour ago

ఫ్యామిలీ సినిమా… దున్నేస్తోంది

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…

2 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సుగాలి ప్రీతి త‌ల్లి కేసు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క‌ర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి త‌ల్లి పార్వ‌తీదేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై…

2 hours ago