జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిద్రలేచింది మొదలుకుని పడుకునే విమర్శించడమే పనిగా పెట్టుకుని అటు బహిరంగ సభల్లో.. ఇటు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా సరే.. అదేదో సినిమా డైలాగ్ లో లాగే మాకు కనపడవ్.. వినపడవ్ సార్ అన్నట్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ‘ఎయిడెడ్ స్కూల్’ వ్యవహారంపై పవన్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సెటైర్లేస్తూ మరీ రాసుకొచ్చారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. అవి మూతబడితే లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్ధులు, సిబ్బందితోపాటు వారి కుటుంబాలను ప్రభుత్వం నిర్ణయం అతలాకుతలం చేసిందని ఆక్షేపించారు. నిజంగా ఎయిడెడ్ పాఠశాలలను, టీచర్లను ఆదుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటే వాటిని స్వాధీనపరుచుకోవడం ఒక్కటే మార్గమా? అసలు ఇంతకంటే మంచి నిర్ణయం, సరైన చర్యలు తీసుకొనే ఆలోచనలే కరవయ్యాయా..? లేదా ప్రభుత్వానికి మరే ఇతర దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అప్పుడు ‘అమ్మ ఒడి’… ఇప్పుడు ‘అమ్మకానికో బడి’ అంటూ పవన్ ప్రాస ఉపయోగించి మరీ సెటైరికల్గా వరుస ట్వీట్లు చేశారు.
పవన్ ఏపీ ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలివే!
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…