జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిద్రలేచింది మొదలుకుని పడుకునే విమర్శించడమే పనిగా పెట్టుకుని అటు బహిరంగ సభల్లో.. ఇటు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా సరే.. అదేదో సినిమా డైలాగ్ లో లాగే మాకు కనపడవ్.. వినపడవ్ సార్ అన్నట్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ‘ఎయిడెడ్ స్కూల్’ వ్యవహారంపై పవన్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సెటైర్లేస్తూ మరీ రాసుకొచ్చారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. అవి మూతబడితే లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్ధులు, సిబ్బందితోపాటు వారి కుటుంబాలను ప్రభుత్వం నిర్ణయం అతలాకుతలం చేసిందని ఆక్షేపించారు. నిజంగా ఎయిడెడ్ పాఠశాలలను, టీచర్లను ఆదుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటే వాటిని స్వాధీనపరుచుకోవడం ఒక్కటే మార్గమా? అసలు ఇంతకంటే మంచి నిర్ణయం, సరైన చర్యలు తీసుకొనే ఆలోచనలే కరవయ్యాయా..? లేదా ప్రభుత్వానికి మరే ఇతర దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అప్పుడు ‘అమ్మ ఒడి’… ఇప్పుడు ‘అమ్మకానికో బడి’ అంటూ పవన్ ప్రాస ఉపయోగించి మరీ సెటైరికల్గా వరుస ట్వీట్లు చేశారు.
పవన్ ఏపీ ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలివే!
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…