జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిద్రలేచింది మొదలుకుని పడుకునే విమర్శించడమే పనిగా పెట్టుకుని అటు బహిరంగ సభల్లో.. ఇటు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా సరే.. అదేదో సినిమా డైలాగ్ లో లాగే మాకు కనపడవ్.. వినపడవ్ సార్ అన్నట్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ‘ఎయిడెడ్ స్కూల్’ వ్యవహారంపై పవన్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సెటైర్లేస్తూ మరీ రాసుకొచ్చారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. అవి మూతబడితే లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్ధులు, సిబ్బందితోపాటు వారి కుటుంబాలను ప్రభుత్వం నిర్ణయం అతలాకుతలం చేసిందని ఆక్షేపించారు. నిజంగా ఎయిడెడ్ పాఠశాలలను, టీచర్లను ఆదుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటే వాటిని స్వాధీనపరుచుకోవడం ఒక్కటే మార్గమా? అసలు ఇంతకంటే మంచి నిర్ణయం, సరైన చర్యలు తీసుకొనే ఆలోచనలే కరవయ్యాయా..? లేదా ప్రభుత్వానికి మరే ఇతర దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అప్పుడు ‘అమ్మ ఒడి’… ఇప్పుడు ‘అమ్మకానికో బడి’ అంటూ పవన్ ప్రాస ఉపయోగించి మరీ సెటైరికల్గా వరుస ట్వీట్లు చేశారు.
పవన్ ఏపీ ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలివే!
This post was last modified on November 15, 2021 7:34 am
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…